యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా కు రూ.1 కోటి రూపాయల జరిమానా.
రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సెప్టెంబరు 7 వ తేదీన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ .1 కోటి రూపాయల జరిమానా విధించింది.
రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సెప్టెంబరు 7 వ తేదీన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ .1 కోటి రూపాయల జరిమానా విధించింది. మోసానికి సంబందించిన కేసులను కనుగొని, వాటిని నివేదించడానికి రిపోర్టు చేయడంలో విఫలమయిన నేపథ్యంలో ఆర్బిఐ ఈ నిర్ణయం తీసుకుంది .బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం క్రింద అధికారం ఉన్నందున ఆర్బిఐ పెనాల్టీ విధించింది.

రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ .1 కోటి రూపాయల జరిమానా విధించింది.గడువులోగా మోసం కేసులను గుర్తించి, నివేదించడంలో విఫలమైనందున బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం క్రింద ఆర్బిఐ పెనాల్టీ విధించింది. ఆర్బిఐ 2018 జనవరి 15 న బ్యాంకుకు ఒక షో కాస్ నోటీసును జారీ చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 1 న బ్యాంక్ రేగులతోర్ కు ప్రతిస్పందించింది. ఆ తర్వాత ఏప్రిల్ 14 న వ్యక్తిగత విచారణ సందర్భంగా నోటి సమర్పణ జరిగింది. ఈ పత్రాలు ఆర్బీఐ కి సంతృప్తిని ఇవ్వకపోవడంతో రూ.1 కోటి రూపాయల జరిమానా విధించింది.
బ్యాంకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని, అంతర్గత నియంత్రణలతో సమర్థవంతంగా వ్యవహరించడానికి, అటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండటానికి ఒక ఖచ్చితమైన దిద్దుబాటు చర్యను అమలుచేశామని బ్యాంకు తెలిపింది. నివేదించిన విధంగా, ప్రభుత్వ రంగ బ్యాంకులను నియంత్రించడానికి మరియు పర్యవేక్షించేందుకు ఆర్బిఐ అనేక అధికారాలను కలిగి ఉంది.
గతంలో, రాజ్యసభలో జరిగిన ఒక చర్చ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులు, వివిధ రంగాలలో ఉద్భవించే వివిధ పరిస్థితులతో వ్యవహరించడానికి ఆర్బిఐ అధికారాలు విస్తృతం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
బ్యాంకులు ఇంకా దాని ఖాతాల పుస్తకాలను పరిశీలించడానికి ఆర్బీఐ అధికారం కలిగి ఉందన్నారు. దీనికోసం త్వరలో బ్యాంకు బోర్డు అదనపు డైరెక్టర్లను కూడా నియమిస్తుంది అని తెలిపారు.


Click it and Unblock the Notifications