కోడి గుడ్డు పొట్టుతో నెలకి రూ.11000 నుంచి రూ.32000 వరకు సంపాదన....!
కోడి గుడ్డు పొట్టు తీసిపారేస్తాము లేదా కొంచెం అవగాహనా ఉన్నవారు అయితే మొక్కల కుండీకి వేస్తారు. కానీ మన ఇండియాలో ఏదన్నా వెరైటీగా ఆలోచిస్తారు మన ప్రజలు. ఇదే ప్రకారంగా ఛత్తీస్గఢ్ లోని మహిళలు ఈ కోడి గుడ్డు పొట్టుతో వ్యాపారం చేస్తున్నారు. కోడి గుడ్డు పొట్టుతో వ్యాపారం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవునండి మీరే చూడండి.
కలెక్టర్ రీతూ సేన్
సెర్బుజా జిల్లా కలెక్టర్ రీతూ సేన్ జిల్లాలోని మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సహాయంతో క్యాంటీన్ మేనేజ్మెంట్, పార్కింగ్, అటెండన్స్ మరియు నగరంలో చెత్త మేనేజ్మెంట్ వివిధ కారిక్రమాలతో పని చూపిస్తున్నారు.
మహిళలతో
ఇప్పుడు కొత్తగా మునిసిపల్ కార్పొరేషన్ కొత్తగా ఒక కారిక్రమానికి శ్రీకారం చుట్టింది. అది ఏంటి అంటే మహిళలతో కోడి గుడ్డు పొట్టు నుండి క్యాల్షియం పౌడర్ మరియు ఎరువులను తయారు చేస్తున్నారు.
క్యాల్షియం పౌడర్
మహిళలకు ముందుగా పరియావరణవేత్త శ్రీనివాస్ తో శిక్షణ ఇప్పించారు. క్యాల్షియం పౌడర్ మరియు ఎరువులను తయారు చేయడానికి ముందుగా కోడి గుడ్డు పొట్టును శుభ్రంగా కడుగుతారు. మరి దాని ఎండా పెట్టి దాని పొడిగా దంచుతారు.
కోడి గుడ్డు
ఒక కిలో గ్రామ్ కోడి గుడ్డు పౌడర్ను ఒక క్విన్ట కోళ్ల దాణాకు కలపాలి .ఇది గింజలలో ఉన్న కాల్షియంను తిరిగి అందిస్తుంది. అలాగే కోళ్లు ఆరోగ్యంగా ఉండడానికి సహాయ పడుతుంది. పశు సంవర్ధక శాఖ కూడా ఈ మహిళలకు సహాయం చేస్తోంది. దీనివల్ల కోడి గుడ్డు పొట్టు చెత్త బుట్టలలోకి పోకుండా రీసైక్లింగ్ అవుతుంది.
ప్రతి నెల
కోడి గుడ్డు పౌడర్ మరియు కోడి గుడ్డు ఎరువులు ఒక కేజీ రూ. 200 నుంచి రూ.600 వరకు ఉంటుంది. వీరు ప్రతి నెల 50 నుంచి 60 కిలోల కోడి గుడ్డు పౌడర్ తయారు చేస్తున్నారు. దీనికి వీరు సంపాదిస్తున్న డబ్బు ఎంతో తెలుసా నెలకి రూ.11 వేల నుంచి రూ.32000 వరకు సంపాదిస్తున్నారు.
అభివృద్ధి కోసం
అసలు దేనికి పనికి రాని ఈ కోడి గుడ్డు పొట్టు వీరికి మంచిగా డబ్బులు సంపాదించి పెడుతున్నాయి.మహిళల అభివృద్ధి కోసం ఆఖరికి కోడి గూడు పొట్టు కూడా ఉపయోగపడుతోంది .కానీ మనుషులు మాత్రం మహిళలని సరిగా గౌరవించలేకపోతున్నాడు.