రూ.500 తో ప్రారంభించి ఇప్పుడు కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీ ఓనర్ ఈమె!
మనం తలుచుకోవాలే కానీ నిజంగా ఈ ప్రపంచంలో మనం సాధించలేనిది అంటూ ఏది లేదు. కరెక్ట్ గా ద్రుష్టి పెట్టి మనసు లక్ష్యం పై నిలపాలే కానీ ఎవరైనా ఏదైనా సాధించవచ్చు.
మనం తెలుసుకోబోయే
ఇప్పుడు మనం తెలుసుకోబోయే మహిళా చేసింది కూడా అదే ఒకప్పుడు ఈమె విధుల్లో తిరుగుతూ ఆమె భర్తతో కలిసి పచ్చడ్లు అమ్ముకొనేది. కానీ ఇప్పుడు కొన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తూ ఒక పచ్చడిలా కంపెనీకి ఓనర్ అయింది.
వెరైటీ పచ్చడిలను
ఇప్పుడు ఈమె ఎన్నో రకాల వెరైటీ పచ్చడిలను ఆహార పదార్ధాలను అమ్ముతూ శబాష్ అని అనిపించుకొంటుంది. ఈ క్రమంలోనే ఈమెకి కొన్ని అవార్డులు మరియు రివార్డులు వరించాయి.ఇంతకీ ఆమె ఎవరు? ఆమె కధ ఏంటో తెలుసుకుందామా?
కృష్ణ యాదవ్
ఆమె పేరు కృష్ణ యాదవ్ ఈమె ఊరు ఢిల్లీ అయితే ఈమె ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్లో ఉండేది. భర్త మరియు ఇద్దరు పిల్లలతో కృష్ణ యాదవ్ జీవిస్తుండేది. అయితే ఈమె పెద్దగా చదువుకోలేదు అలాగే ఈమె భర్త చదువు కూడా అంతంత మాత్రమే ఇద్దరు కలిసి ఊరగాయ వ్యాపారం మొదలు పెట్టారు ఇక్కడ పలు రకాల ఊరగాయలు తయారు చేసి అమ్మేవారు. కానీ ఉత్తర్ ప్రదేశ్లో వెరీ వ్యాపారం సరిగా జరగలేదు.
ఢిల్లీకి మకాం
దింతో వారు ఢిల్లీకి మకాం మార్చి 1996 లో కృష్ణ యాదవ్ ఫుడ్ ప్రాసెసింగ్ శిక్షణ తీసుకొంది ఇక్కడ తెలుసుకున్న మెలకువలతో మల్లి కృష్ణ ఊరగాయలు వ్యాపారం మొదలు పెట్టింది. ఈమెకు మొదట రూ.500 మాత్రమే ఖర్చు పెట్టింది ఆ తరవాత పచ్చడి తయారీ కోసం కావాల్సిన సరుకులు కొన్నది. ఆ తర్వాత రూ.3000 ఖర్చు పెట్టి కరివి అంటే హిందీలో కరొండా అనే కాయతో 100 కేజీల ఊరగాయ పెట్టింది. దింతో పాటు 5 కేజీల మిరపకాయ కూడా పెట్టింది మొత్తానికి వీటిని అమ్మేయగా ఆమెకు రూ.5200 లాభం వచ్చింది. దింతో ఆమె అలాగే పచ్చడ్లు తయారు చేయడం ప్రారంభించింది.
శ్రీ కృష్ణ పికెల్
అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు రకరకాల పచ్చడ్లు తయారు చేసి అలాగే రకరకాల ఆహార పదార్థాలు చేసి ఒక స్వగృహ ఫుడ్స్ లాగా ప్రారంభించింది. ఈ క్రమంలో వారి వ్యాపారం బాగా సాగింది దింతో వీరు ఏకంగా శ్రీ కృష్ణ పికెల్ అని ఒక కంపెనీ ప్రారంభించారు.దింతో వీరు ఈటా కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నారు. ఇప్పటికి ఈమె ఏదో ఒక వెరైటీ ఉరగాయి తయారు చేస్తానంటుంది.వాటికీ అప్పటికప్పుడు గిరాకీ పెరుగుతూనే ఉంటుంది
మోడీ గారి చేతుల మీదుగా
ఆలా ఈమె మరియు ఆమె భర్త ఢిల్లీలో ప్రముఖ వ్యాపారులలాగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే కృష్ణ యాదవ్ కు పలు అవార్డులు మేరు రివార్డులు లభించాయి. ఈమెకు 2015 లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా నారి శక్తి పురస్కార్ అవార్డును కృష్ణ యాదవ్ అనుదుకొంది.అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఉత్తమ మహిళా వ్యాపారిగా రూ.51000 వేలు అందుకొంది.
పేద కుటుంబం
పెద్దగా చదువుకోకపోయిన, పేద కుటుంబం నుంచి వచ్చిన కృష్ణ యాదవ్ ఈరోజు కొన్ని కోట్ల రూపాయిలు సంపాదిస్తున్న విధానం చూస్తే అందరి మహిళలకు ఒక స్ఫూర్తి దాయకం.