నోటు పై గాంధీ గారి బొమ్మ ఎలా వచ్చిందో తెలుసా?అసలు ఆ ఫోటో ఎక్కడిది అంటే?
రైలు బండిని నడిపేది పచ్చ జండా అయితే మన బతుకు బండిని నడిపేది పచ్చ నోటు అంతే కాదు అందరు పైసాలో పరమాత్మ ఉంది అని అంత అనుకుంటారు. వేదం సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన్నట్లు జేబులు నుండి జేబులు మారే కాగితం ఈ పచ్చ నోటు.
నరేంద్ర మోడీ
మొన్న ఈ మధ్య మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు రూ.500 మరియు రూ.1000 నోట్లను నిషేధించి అందరికి నోట్ల కష్టాలు ఎలా ఉంటాయో తెలిసేలా చేసాడు. సామాన్యుడి నుంచి ధనవంతుడు దాకా ప్రతి ఒకరు నోట్ల కష్టాలు చూడక తప్పలేదు.
అసలు గాంధీ గారు
ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏమిటి అంటే రూ.5 రూపాయిల నోటు నుండి రూ.2000 నోటు దాకా అన్ని నోట్ల మీద గాంధీ గారి బొమ్మ ఉంటుంది. అసలు గాంధీ గారు ఫోటో ఎప్పుడు వేశారు? అసలు ఎందుకు వేశారు? ఇప్పుడు చూద్దాం.
బ్రిటిష్ రాజకీయ నాయకుడు
అసలు నోట్ల మీద ఉన్న గాంధీ గారి బొమ్మ ఎవరో గీసింది కాదు ఒక అజ్ఞాత ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో గాంధీ గారు నవ్వుతూ లాయర్ ఫెడ్రిక్ లారెన్స్ గారి పక్కన ఉన్న ఫోటో అది.
అసలు ఈ ఫెడ్రిక్ లారెన్స్ బ్రిటిష్ రాజకీయ నాయకుడు ఈయన బ్రిటన్లో మహిళా శ్రేయస్సు కోసం పోరాడారు.అలాగే ఈయన భారత వర్మకి కూడా సెక్రెట్రీ లాగా పని చేశారు.
రాష్ట్రపతి భవన్
1946 లో గాంధి గారు ఫెడ్రిక్ లారెన్స్ ని కలిసినపుడు ఒక జర్నలిస్ట్ తీసిన ఫోటో అది. వైస్రాయ్ హౌస్ ఇప్పుడు ఏది రాష్ట్రపతి భవన్ అని పిలుస్తారు ఇక్కడే ఈ ఫోటో తీశారు. ఈ ఫోటోలో గాంధీ గారిని క్రాప్ చేసి మిర్రర్ ఫోటో చేసి నోటు పై ముద్రించారు.
అంతకముందు
1987 లో మొదట రూ.500 రూపాయిల నోట్ పై గాంధీ గారి బొమ్మ ముద్రించారు. ఇక 1996 నుండి గాంధీ గారి బొమ్మ అన్ని నోట్ల పై అచ్చు వేయడం ప్రారంభం అయింది. అంతకముందు మన డబ్బు నోట్ల పై అశోక చక్రాలు మాత్రమే ఉండేవి.
మిర్రర్ ఫోటో
ఇక 1996 లో రూ.500 నోటు రూపు రేఖలు మార్చారు. ఇక 2016 లో రూ.500 మరియు రూ.2000 నోట్ల పై మిర్రర్ ఫోటో ఉపయోగినిచకుండా ఒరిజినల్ ఫోటో ఉపయోగించారు.