కరెన్సీ నోట్లు రోగాలను వ్యాప్తి చేస్తున్నాయన్న కలవరం మొదలైంది. దీనిపై దర్యాప్తు చేయాలంటూ ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకే లేఖ రావడంతో ఆందోళన ఇంకాస్త పెరిగింది.

బీరువాలో
మీ ఇంట్లో బీరువాలో నోట్ల కట్టలు ఉన్నాయా? డబ్బు బాగానే సంపాదించేశామని సంబరపడిపోతున్నారా? అయితే ఈ కరెన్సీ నోట్లే మీకు రోగాలను అంటించగలవు జాగ్రత్త. కరెన్సీ నోట్లేంటీ రోగాలు అంటించడమేంటీ అనుకుంటున్నారా? ఇప్పుడు తాజాగా కలవరపరుస్తున్న విషయమిదే.

అరుణ్ జైట్లీ
దీనిపైనే అఖిల భారత వర్తకుల సమాఖ్య(సీఏఐటీ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతే కాదు దీనిపై దర్యాప్తు చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసింది సీఏఐటీ. ఆ లేఖ కాపీలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్లకు పంపింది.

నోట్లతో రోగాలొస్తాయా?
కరెన్సీ నోట్లతో రోగాలొస్తాయన్న ఆందోళనకు కారణం మీడియాలో అధ్యయనాలు, మీడియాలో వస్తున్న వార్తలే. కరెన్సీ నోట్ల కారణంగా చర్మవ్యాధులు, నోటి, జీర్ణాశయ సమస్యలు, మూత్రకోశ, శ్వాసకోశ రోగాలు సంక్రమిస్తున్నాయన్నది సీఏఐటీ వాదన.

సామాన్య ప్రజలకు
కొన్ని అధ్యయనాలు ఇదే రుజువు చేశాయని వర్తకుల సమాఖ్య వాదిస్తోంది. అయితే వ్యాపారులు, వర్తకులే కరెన్సీ నోట్లను ఎక్కువగా వాడుతుంటారు. దీంతో సీఐఏటీ రంగంలోకి దిగింది. సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది అని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

సైన్స్ పత్రికలు
సైన్స్ పత్రికలు ఏటేటా ఇలాంటి కథనాలను ప్రచురిస్తుంటాయి. హెచ్చరికల్ని చేస్తుంటాయి. తీవ్రమైన ప్రజారోగ్య సమస్యపై ఎలాంటి విచారణ జరపకపోవడం విచారకరం. వర్తకులు, వ్యాపారులు కరెన్సీ నోట్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఒకవేళ ఆ కథనాల్లో నిజం ఉంటే వ్యాపారులు మాత్రమే కాదు వినియోగదారులకూ ఇబ్బందులు తప్పవు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications