హైదరాబాద్ లోని IKEA స్టోర్ లో వడ్డించిన వెజ్ బిర్యానీలో కస్టమర్ కు గొంగళి పురుగు ప్రత్యక్షమైనది.
హైదరాబాద్:హైదరాబాద్ లోని IKEA స్టోర్ లో వడ్డించిన వెజ్ బిర్యానీలో కస్టమర్ కు గొంగళి పురుగు ప్రత్యక్షమైనది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎమ్సి) స్టోర్ మేనేజ్మెంట్ కు రూ.11,500 రూపాయల జరిమానా విధించింది.దీంతో బిర్యానీ సరకు రవాణా దిగ్బంధం జరిగింది.

IKEA యాజమాన్యం:
IKEA యాజమాన్యం జరిగిన సంఘటనకు కస్టమర్ కు క్షమాపణలు కోరింది.ఈ సంఘటన శుక్రవారం జరిగింది. జిహెచ్ఎంసి సంఘం తెలిపిన ప్రకారం, ఆహార భద్రతా అధికారి, ఆరోగ్య అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ (AMOH), స్పెషల్ జోన్ యొక్క వెటర్నరీ ఆఫీసర్ మరియు ఆహార ఇన్స్పెక్టర్ శనివారం కస్టమర్ నుండి ఫిర్యాదు అందుకున్న తరువాత ఐ.కె.ఇ.ఎ రెస్టారెంట్ను తనిఖీ చేశామని చెప్పారు. అధికారులు బాక్టీరియా విశ్లేషణ కోసం ఆహార నమూనాలను సేకరించారు. మొట్టి తప్పు కింద, అధికారులు GHMC యొక్క హోటల్ అనువర్తనం ప్రకారం మానేజ్మెంట్ కు రూ .11,500 జరిమానా విధించారు.

ఫుడ్ సేఫ్టీ అధికారి:
అంతే కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారి రెస్టారెంట్ నిర్వాహకుడికి, అలాగే బిరియాని తయారుచేసిన మనిషికి నోటీసుల జారీచేశారు.
ఐకెయా రెస్టారెంట్ మేనేజ్మెంట్ (కస్టమర్ చేత) ఫిర్యాదు లో పేర్కొన్నట్లు వెజ్ బిరానీలో గొంగళి పురుగు ఉందని అంగీకరించారని అధికారి చెప్పారు, మిగిలిపోయిన మిగతా వెజ్ బిర్యానీ సరుకును IKEA నిర్వహణ చేయకుండా దిగ్బంధంలో ఉంచామని తెలిపారు.

IKEA రెస్టారెంట్ :
నాగపూర్ కు చెందిన హల్దిరాం నుండి IKEA రెస్టారెంట్ తయారుచేసిన వెజ్ బిరియాని అమ్మకాన్ని చేపట్టింది .బెంగళూరులో ఉన్న ఐకెయా ఫుడ్ సేఫ్టీ టీం యీ ఘటనపై ఆరాదీసేందుకు నాగపూర్ లో ఉన్న హల్దిరాం ను సంప్రదించనుంది.

ఐకెయా క్షమాపణలు చెప్పింది
IKEA తన కస్టమర్ కు క్షమాపణలు చెప్పింది.హోటల్ కు సంబందించిన వ్యక్తి మాట్లాడుతూ,జరిగిన సంఘటనకు మేము చాల చింతిస్తున్నాం అంటూ ఇది ఎలా జరిగిందో ఇంకా వివరాలు తెలిసి రావాలని తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి ఎటువంటి తప్పులు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించ్చారు.


Click it and Unblock the Notifications