అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో దేశీయ మార్కెట్లు చెలరేగిపోతున్నాయి. నిన్నటి నుంచి మార్కెట్లన్నీ భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు, తరవాత యూరో మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. యూరో మార్కెట్లలో జోష్ తగ్గినట్లు కనిపిస్తోంది. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 46 పాయింట్ల లాభంతో 11738 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకదశలో రికార్డు లాభాలు పొందిన నిఫ్టి మిడ్ సెషన్ తరవాత చల్లబడింది. మెటల్, ఎనర్జి రంగాల నుంచి అందిన మద్దతు నిఫ్టికి చాలా ఉపకరించింది.ఇతర కౌంటర్లలో లాభాలు అంతంత మాత్రమే ఉన్నాయి. పీఎస్ యూ బ్యాంకు షేర్ల సూచీ ఇవాళ ఒకటిన్నర శాతం పడినా.. మార్కెట్ నిలదొక్కుకోవడానికి ఇతర రంగాల నుంచి అందిన మద్దతే. నిఫ్టి షేర్లలో హిందాల్కో 4 శాతంపైగా లాభంతో టాప్ గెయినర్ గా నిలిచింది. రిలయన్స్, అదానీ, వేదాంత షేర్లు రెండు శాతంపైగా లాభపడ్డాయి. మారుతీ కూడా 1.75 శాతం లాభపడింది. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో గెయిల్ దాదాపు అయిదు శాతం నష్టంతో టాప్ లూజర్ గా నిలిచింది. ఎస్ బ్యాంక్ 3 శాతంపైగా లాభపడింది. హెచ్ పీసీఎల్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేర్లు ఒకశాతంపైగా నష్టపోయాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ 8 శాతం లాభపడగా, జెట్ ఎయిర్ వేస్ ఆరు శాతంపైగా లాభంతో క్లోజైంది.