కేరళకి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ముకేశ్ అంబానీ ఎంత ఇచ్చాడో తెలుసా?
కేరళ రాష్ట్రంలో వందేళ్లలో ఎన్నడూ లేని వర్షాలు కురుస్తున్నాయి. 'గాడ్స్ ఓన్ కంట్రీ'గా పేరొందిన ఆ రాష్ట్రం భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి.
13 జిల్లాల్లో
రాష్ట్రంలోని 44 నదులు పొంగిప్రవహిస్తుండటంతో 80 ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దాదాపు 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంది. ఉత్తరాన కాసర్గోడ్ నుంచి దక్షిణం చివర ఉన్న తిరువనంతపురం వరకు అన్ని జిల్లాలపై వరుణుడు కుంభవృష్టి కురిపిస్తున్నాడు
రిలయన్స్ ఫౌండేషన్
కేరళ వరద బాదితులకు సహాయార్థ్యం నీతా అంబానీ నిర్వహిస్తున్న రిలయన్స్ ఫౌండేషన్ రూ.21 కోట్ల నిధులను చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు అందిస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా దాదాపు రూ.50 కోట్ల విలువ చేసే ఉత్పత్తులను అందించనున్నట్లు తెలిపింది.
మహారాష్ట్ర
ప్రభుత్వం నిర్వహిస్తున్న 160 రిలీఫ్ క్యాంపుల్లోని 50,000 మందికి రిలయన్స్ రిటైల్ తినడానికి సిద్దంగా అహారోత్పత్తులను, సానిటరీ నాపికిన్స్ అందించాలని నిర్ణయించింద న్నారు. ఈ ఉత్పత్తులను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించామని, ఇక్కడి నుంచి కేరళకు సరఫరా కానున్నాయని ఆ సంస్థ పేర్కొంది. 7.5 లక్షల వస్త్రాలు, 1.5 లక్షల పాదరక్షలు, కిరాణ సరుకులను సరఫరా చేయనున్నట్లు తెలిపింది.