ఇది చదివితే మీరు కూడా రాంచరణ్ ని సూపర్ అంటారు మరి లేట్ ఎందుకు చదవండి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ భారీస్థాయిలో విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
7 కొత్త విమానాలతో
మార్చి 2019 నాటికి 7 కొత్త విమానాలతో 20 ప్రాంతాలకు తమ ట్రూజెట్ బ్రాండ్ విమానాలను నడపాలని యాజమాన్యం భావిస్తోంది. ఇందుకోసం అప్పుల్లో కూరుకుపోతున్న జెట్ ఎయిర్ వేస్ తో చర్చలు కూడా ప్రారంభించింది. ఈ నెలలోనే ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
జెట్ ఎయిర్ వేస్
జెట్ ఎయిర్ వేస్ తో ఒప్పందం కుదిరితే 7 ఏటీఆర్ విమానాలు ట్రూజెట్ ఫ్లీట్ లో చేరతాయి. ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు అమలులో ఉంటుంది. 7 ఏటీఆర్ విమానాలతో పాటు సిబ్బంది, నిర్వహణ, ఇన్సూరెన్స్ లను కూడా సబ్ లీజుకి తీసుకొనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలిసింది.
ట్రూజెట్ జెట్
ఈ 7 విమానాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తే ట్రూజెట్ జెట్ ఎయిర్ వేస్ నుంచి మరిన్ని విమానాలను సబ్ లీజుకి తీసుకొనే అవకాశం ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం
జూలై 2015న ట్రూజెట్ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం 5 ఏటీఆర్-72 విమానాలతో 14 ప్రాంతాలకు విమానాలు నడుపుతోంది.
తన కార్యకలాపాలు
టైర్ 2, టైర్ 3 నగరాలను కలుపుతూ చౌకగా విమానయానం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కింద ట్రూజెట్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. విస్తరణ అనంతరం పశ్చిమ మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు విమానాలు నడిపే యోచనలో ఉంది ట్రూజెట్.