జియో అభిమానులకి శుభవార్త ఆదరకొట్టిన జియో ఫోన్ 2 బుకింగ్లు
జియో అభిమానులకు శుభవార్త. టెలికాం రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన జియో ఇప్పుడు మరో కొత్త సంచలనానికి నాంది పలుకుతోంది. జియో ఫోన్2 కొనాలనుకునే వారికి అనుకూలంగా ఉండేలా రిలయన్స్ జియో.. ష్లాష్ సేల్ ప్రకటించింది
జియో వెబ్సైట్లో
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జియో వెబ్సైట్లో ఈ ఫ్లాష్ సేల్ మొదలవుతుంది. క్వెర్టీ కీప్యాడ్తో జియో ఫోన్ 2 వస్తున్నది. జియో ఫోన్-2 ధర రూ.2999గా ఉండగా, వినియోగదారులు తమ పాత ఫీచర్ ఫోన్ను వెనక్కిచ్చి కేవలం రూ. 501కే కొత్త జియో ఫోన్ను పొందవచ్చు. జియో ఫోన్-2 వినియోగదారుల కోసం కంపెనీ రూ.49, రూ.99, రూ.153 పేరిట ప్రత్యేకమైన ప్లాన్ లని ప్రకటించింది.
జియో ఫోన్లో
ముందు విడుదలైన జియో ఫోన్ డిస్ప్లేకు పూర్తి భిన్నంగా ఈ ఫోన్లో హారిజాంటల్ డిస్ప్లేను తీసుకొచ్చారు. ఇక ముందుగానే చెప్పినట్లు ఆగస్ట్ 15 నుంచి జియో ఫోన్లో ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ యాప్స్లాంటి ఫీచర్లను అందుబాటులోకి తేనుంది.
వాట్సాప్ కూడా
త్వరలోనే వాట్సాప్ కూడా రానున్నట్లు జియో ప్రకటించింది. రిలయెన్స్ ఈ మధ్యే మాన్సూన్ హంగామా ఆఫర్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద యూజర్లు తమ పాత ఫీచర్ను ఇచ్చి కేవలం రూ.501కే జియో ఫోన్ను సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.