రాజధాని అమరావతి నిర్మాణం కోసం బాండ్ల ద్వారా నిధులు సమీకరించే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. మొత్తం రూ. 10,000 కోట్లను రాజధాని నిర్మాణానికి బాండ్ల ద్వారా సమీకరించాలన్నది ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యం. ఇందులో భాగంగా తొలి విడతగా రూ. 1300 కోట్ల విలువైన బాండ్లను ఇవా ళ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్)లో సబ్స్క్రిప్షన్ కోసం ఉంచారు. ఒక్కో బాండ్ ముఖవిలువ రూ. 10 లక్షలు. కేవలం సంస్థాగత ఇన్వెస్టర్లకు మాత్రమే వీటిని జారీ చేస్తారు. ఈ నెలాఖరులో ఇవి బీఎస్ఈలో ట్రేడింగ్ కోసం లిస్ట్ చేస్తారు. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన వస్తే మరో రూ. 700 కోట్ల బాండ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన ఉంటే ప్రభుత్వం ఈ ఇష్యూ ద్వారా రూ. 2000 కోట్లను సమీకరిస్తుందన్నమాట.ఇవాళ ప్రారంభించిన బాండ్ ఇష్యూకు ఎన్నారైల నుంచి అనూహ్య స్పదన లభించిందని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ బాబు అన్నారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇన్వెస్టర్లు నిర్ణయానికి రావాలని, అమరావతి పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని పరిగణలో తీసుకోవద్దని ఆయన ఇన్వెస్టర్లను కోరారు.

త్వరలో రీటైల్ బాండ్లు
సాధారణ ప్రజలు కూడా రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యులు అయ్యేందుకు వీలుగా త్వరలో రీటైల్ బాండ్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వివిధ రకాల లాంఛనాలను పూర్తి చేస్తున్నామని, అన్నీ కుదిరితే అక్టోబర్ లేదా నవంబర్ లో రీటైల్ బాండ్లు జారీ చేస్తామని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. వీటి ముఖ విలువ రూ. 1000గా ఉంటుంది కాబట్టి.. సాధారణ ప్రజలు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసే అవకాశముంటుంది. వీటి ద్వారా రూ. 8000 కోట్లు సమీకరించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications