స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్?
భారతదేశ స్వతంత్ర దినోత్సవం బుధవారం జరుపుకోనుంది. ఈ సందర్బంగా పలు వైమానిక సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లను అందిస్తున్నాయి.
న్యూఢిల్లీ: భారతదేశ స్వతంత్ర దినోత్సవం బుధవారం జరుపుకోనుంది. ఈ సందర్బంగా పలు వైమానిక సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లను అందిస్తున్నాయి. భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా, ఎయిర్ ఇండియా ప్రయాణికుల కోసం ఆకర్షణీయమైన టికెట్ ఛార్జీలని అందిస్తోంది. జాతీయ విమాన సంస్థ ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్ ద్వారా విమాన బుకింగ్ల ద్వారా రాయితీ ధర అందుబాటులో ఉంది.
దేశీయ మరియు అంతర్జాతీయ విమానాల ప్రయాణాలకు ఆగస్టు 15 వరకు తాజా డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.ఈ డిస్కౌంట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, అలయన్స్ ఎయిర్ విమానాలు, కోడ్ షేర్ ఫ్లైట్స్లలో వర్తించదు.
మరో క్యారియర్ ఎయిర్ ఏషియా ప్రత్యేకించి స్వతంత్ర దినోత్సవ ఆఫర్ తో ముందుకు వచ్చింది. దేశీయ విమాన టిక్కెట్లపై 45 శాతం తగ్గింపు ఇండిపెండెన్స్ డే సేల్ కింద ఈ ఎయిర్లైన్స్ అందిస్తోంది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఆసియ కు చెందిన ఇండియన్ ఇండిపెండెన్స్ సేల్ ప్రమోషన్ పథకం కింద బెంగళూరు, కోల్కతా, అమృత్సర్, న్యూఢిల్లీ, రాంచి,కు ప్రయాణం చేయవచ్చని ఎయిర్ఏషియా తన వెబ్సైట్లో పేర్కొంది.
19
ఆగస్టు
2019
మరియు
ఆగస్టు
13,
2019
మధ్యకాలంలో
విమాన
టిక్కెట్లపై
ఎయిర్
ఏషియా
ఆఫర్
అందుబాటులో
ఉంటుంది.ఎయిర్
ఇండియా
విమాన
టిక్కెట్ల
ఈ
ఆఫర్
71
వ
స్వతంత్ర
దినోత్సవం
సందర్బంగా
అందిస్తోంది.
గో ఎయిర్ కూడా మరోసారి ఆగస్టు 15 వరకు 'గో Gr8 ఫెస్టివల్ సేల్' ఆఫర్ను పొడిగించింది. ఈ ఆఫర్ ప్రకారం గో ఎయిర్ దేశీయ విమాన టిక్కెట్లను 1 లక్ష సీట్లకు రూ .1,099 ప్రారంభ ధర వద్ద అందిస్తోంది.
అంతకుముందు, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పూర్తి సర్వీసు క్యారియర్ జెట్ ఎయిర్వేస్ కూడా స్వతంత్ర దినోత్సవ ఆఫర్తో ముందుకు వచ్చింది. ఎయిర్లైన్స్ లో ప్రయాణించే ఎకానమీ మరియు ప్రీమియర్ తరగతి ఛార్జీల మీద బేస్ ఛార్జీలు 30% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ వన్-వే మరియు రిటర్న్ రెండు మార్గాల టికెట్లలో వర్తించబడుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయాలపై ఈ జెట్ ఎయిర్వేస్ ఆఫర్ ఆగస్టు 15 న ముగుస్తుంది.