For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

By Sabari
|

శుక్రవారం మార్కెట్లకు ఏ మాత్రం కలసిరాలేదు. ఉదయం నుంచే ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు సరికదా.. మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతోపాటు.. బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సూచీలు నష్టాల బారిన పడ్డాయి. బ్యాంక్‌ షేర్లతో పాటు మెటల్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, ఎనర్జీ షేర్లు కూడా నష్టాలను చవిచూశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి.

నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

నిన్నటిరోజుతో పోలిస్తే ఉదయం 60 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్.. చివరకు 155.14 పాయింట్ల నష్టంతో 37,869.23 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 41.2 పాయింట్లు నష్టపోయి 11,429.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 68.85 వద్ద ముగిసింది. బంగారం ధరలు 30 పాయింట్ల నష్టంతో రూ.29,638 వద్ద స్థిరపడింది. వెండి ధర రూ.37,990 వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్‌లో.. ఐషర్‌ మోటార్స్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం, మహింద్రా అండ్‌ మహింద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభపడగా.. ఎస్‌బీఐ, వేదాంతా లిమిటెడ్‌, టాటామోటార్స్‌, గెయిల్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి.

Read more about: stock market
English summary

నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ | Nifty Breaks 5-Day Rise To Settle At 11,430, Sensex Sheds 155 Points

Friday's session on a negative note. The S&P BSE Sensex plunged 155.14 points, or 0.41 per cent, to end at 37,869.23, as investors booked profits amid lacklustre global cues.
Story first published: Friday, August 10, 2018, 17:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X