For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్ లో మరో 13 ఐటీ కంపెనీలు ప్రారంభించిన నారా లోకేష్

By Sabari
|

ఏపీలో నిరుద్యోగులందరికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖలో కొత్తగా ఏర్పాటైన 13 ఐటీ కంపెనీలను ఆయన ప్రారంభించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు, ఉద్యోగులతో లోకేష్ కాసేపు ముచ్చటించారు. తర్వాత కాపులపాడు ఐటీ పార్క్‌పై సమీక్ష నిర్వహించారు. విశాఖ కంపెనీల్లో సీఈఎస్‌ లిమిటెడ్, సెరియం సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఐఓటి, సహస్రమయ టెక్నాలజీస్, వెలాంటా కేపీఓ అకౌంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సింబయోసిస్, ఇన్స్ పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్, ఇన్స్ పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్, పాత్రా ఇండియా బీసీఓ సర్వీసెస్ ఉన్నాయి. ఈ కంపెనీలతో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో మరో 13 ఐటీ కంపెనీలు ప్రారంభించిన నారా లోకేష్

ఐటీలో లక్ష ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్‌లో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు మంత్రి లోకేష్. నూటికి నూరుశాతం ఉద్యోగాలు కల్పించి.. అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటామన్నారు. ఏపీ రాజధాని అమరావతితో పాటూ మిగిలిన జిల్లాలకు ఐటీని విస్తరిస్తామన్నారు మంత్రి. విశాఖకు రాబోయే రోజుల్లో మరిన్ని ఐటీ కంపెనీలు వస్తాయన్నారు. 2024నాటికి రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాన్ని కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఏపీలో పెట్టుబడులకు ముందుకొస్తున్న కంపెనీలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Read more about: andhra pradesh
English summary

ఆంధ్రప్రదేశ్ లో మరో 13 ఐటీ కంపెనీలు ప్రారంభించిన నారా లోకేష్ | Nara Lokesh Launch 13 IT companies in Visakhapatnam

Visakhapatnam is fast emerging as the best location for IT companies in Andhra Pradesh.
Story first published: Friday, August 10, 2018, 16:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X