త్వరలో ఇండియా పోస్ట్ పెమెంట్స్ బ్యాంక్ ప్రారంభించనున్న మోడీ.
ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆగస్టు 21 న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) నుప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం టాల్కటోరా రాజధాని స్టేడియంలో జరుగుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆగస్టు 21 న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) నుప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం టాల్కటోరా రాజధాని స్టేడియంలో జరుగుతుంది.
రాయ్పూర్ మరియు రాంచీలలో ఈ బ్యాంకు పైలట్ సేవలు నడుపుతున్నాయి. రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పాలసీలు అందించే ఇతర బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలతో ఇది ముడిపడి ఉంటుంది.ప్రైవేటు సంస్థలైన ఎయిర్టెల్, ఫినో, పెటియం మొదలైన పలు ప్రైవేట్ సంస్థలు ఈ సేవలను ప్రారంభించాయి.
IPPB (ఇండియన్ పోస్ట్ పెమెంట్స్ బ్యాంక్ ) భారతదేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ నెట్వర్క్లలో ఒకటిగా మారింది. ఇండియా పోష్టుల్లో 154,000 పోస్టాఫీసులు ఉన్నాయి, వాటిలో 139,000 గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పర్యవేక్షణా కార్యాలయాల కోసం మరియు నియంత్రణా కార్యాలయాల కోసం 650 శాఖలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. ఈ శాఖలు ఈ సంవత్సరం చివరినాటికి IPPB కు లింక్ చేయబడతాయి.
ఒక ఖాతాదారుడు రూ.100,000 రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు అలాగే నగదును ఉపసంహరించుకోవచ్చు మరియు ఇతర వాణిజ్య బ్యాంక్లో పొదుపు బ్యాంకు ఖాతా వలె చెల్లింపులు చేయవచ్చు. అయినప్పటికీ, రూ. 100,000 పరిమితిని అధిగమించేందుకు, 170 మిలియన్ల పోస్ట్ ఆఫీస్ పొదుపు బ్యాంకుల (పిఒఎస్బి) ఖాతాతో అనుసంధానం చేసేందుకు బ్యాంకు అనుమతి పొందింది. IPPB ఖాతాలో ఒక డిపాజిట్ రూ. 100,000 కంటే ఎక్కువైతే, అది పిఒఎస్బి కు బదిలీ చేయబడుతుంది. పోస్ట్ ఆఫీస్ లో 370 మిలియన్ల వివిధ రకాల ఖాతాలు ఉన్నాయి, ఇవి IPPB కు అనుసంధానించబడి ఉంటాయన్నారు.
IPPB ఇంటికి కూడా బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. సుమారు 250,000 డాక్ సేవక్స్ మరియు మరో 50,000 మంది నెట్వర్క్లలో అందుబాటులో ఉన్నారు. ప్రారంభంలో 11,000 మందితో ఈ సేవలను అందిస్తారని, తరువాత మరింత మంది ఉద్యోగులు రాబోతున్నారని ఆ వర్గాలు తెలిపాయి.