రెండో రోజు కూడా నష్టాల బాటలో స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ భారీ పతనం.

ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపు ప్రభావం కారణంగా స్టాక్‌మార్కెట్లు రెండోరోజూ (ఆగస్టు 2) భారీ నష్టాలను నమోదు చేశాయి. గురువారం ఉదయం నుంచే సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించగా.. నిఫ్టీ 11,300 మార్క్‌ దిగువన ప్రారంభమైంది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేని సూచీలు చివరకు భారీ స్థాయిలో నష్టపోయాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నేలచూపు చూశాయి.

చైనాతో వాణిజ్య యుద్ధానికి అమెరికా మళ్లీ కాలుదువ్వడంతో అంతర్జాతీయం ప్రతికూల పవనాలు ఏర్పాడ్డాయి. దీంతో స్టాక్ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. ఒక్క ఫార్మా షేర్లు మాత్రమే ఫర్వాలేదనిపించాయి. బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌, ఐటీ షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి.

రెండో రోజు కూడా నష్టాల బాటలో స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ భారీ పతనం.

గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి.. సెన్సెక్స్‌ 356 పాయింట్లు పతనమై 37,165 వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు కోల్పోయి 11,245 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.66గా కొనసాగుతోంది.

లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్, గెయిల్‌, హెచ్‌యూఎల్‌, కోల్‌ ఇండియా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం షేర్లు లాభపడగా.. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌, మారుతి, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, వేదాంతా, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్ర షేర్లు నష్టపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+