తగ్గిన పెట్రోల్ ధరలు:ప్రధాన నగరాల్లో ధరలు పరిశీలించండి.
చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసి) శనివారం పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాయి. ఐఒసి (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) రేటు ప్రకారం, పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ.76.16 రూపాయలు.
చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసి) శనివారం పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాయి. ఐఒసి (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) రేటు ప్రకారం, పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ.76.16 రూపాయలు, ముంబైలో లీటరుకు రూ. 83.61 రూపాయలు. కోల్కతా, చెన్నైలలో పెట్రోల్ ధర రూ.79.05 ,రూ.79.11 రూపాయలు లీటర్ కు.
అలాగే డీజిల్ ఢిల్లీలో లీటరుకు రూ. 67.62 రూపాయలు,ముంబైలో రూ. 71.79 రూపాయలు, కోల్కతాలో రూ. 70.37 రూపాయలు, చెన్నైలో రూ.71.41 లీటరుకు చొప్పున ధరలు ఉన్నాయని దేశంలో అతి పెద్ద ఇంధన రిటైలర్ అయిన ఐఒసి పేర్కొంది. పెట్రోల్ ధరలు శుక్రవారం నాలుగు నగరాల్లో ఎటువంటి మార్పులు లేవు, అయితే, డీజిల్ ధరలు తగ్గాయి.
పైన పేర్కొన్న రేట్లు నేడు ఉదయం 6 గంటల నుండి వర్తించబడతాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఇంధన ధరలను సవరిస్తారు. గత ఏడాది జూన్ మధ్యకాలంలో ఇంధన రేట్లను రోజువారీగా పునర్విమర్శ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
అంతర్జాతీయంగా చమురు ధరలు శుక్రవారం పడిపోయాయి. యుఎస్ ఈక్విటీస్ మార్కెట్లో తగ్గుముఖం పట్టాయి. కాని బ్రెంట్ ఇప్పటికీ వారాంతపు వృద్ధిని నమోదు చేసింది, వాణిజ్య ఒత్తిళ్లను సులభతరం చేయడం మరియు సౌదీ అరేబియా కీలకమైన ముడి చమురు షిప్పింగ్ మార్గాల తాత్కాలిక నిలిపివేత ద్వారా మద్దతు ఇచ్చింది అని రాయిటర్స్ పేర్కొన్నారు.
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 25 సెంట్లు తగ్గి 74.29 డాలర్ల బ్యారెల్కు పడిపోయాయి. అయితే, వారం గరిష్ఠ పెరుగుదల 1.8 శాతం పెరిగింది.
US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 92 సెంట్లు పడిపోయి $ 68.69 ఒక బ్యారెల్కు పడిపోయాయి,ఇది వరుసగా నాలుగో వారం క్షీణించి, 2.4 శాతం పడిపోయింది.