మరి కొద్దీ రోజుల్లో పెట్రోల్ మరియు డీజిల్ బంద్ ఎందుకో తెలుసా?
లారీ సమ్మెతో ఇప్పటికే నిత్య అవసర వస్తుల కొరత మొదలయ్యింది. దీని ఆసరాగా తీసుకోని కొంతమంది వ్యాపారాలు నిత్యావసర వస్తుల ధరలు పెంచేస్తున్నారు.తాజాగా పెట్రోల్ బంకులో పెట్రోల్ మరియు డీజిల్ నిలువలు అడుగంటుతున్నాయి అని యజమానులు చెబుతున్నారు
లారీ సమ్మె
అదే నిజమైతే మరి కొద్దీ రోజుల్లో పెట్రోల్ మరియు డీజీల్ కొరత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే లారీ సమ్మె కి తమ మద్దతు ఉంటుంది అని తెలంగాణ ట్రక్ అసోసియేషన్ ప్రకటించింది
పెట్రోల్
లారీల సమస్యల పై ప్రభుత్వం స్పందించకపోతే తాము మద్దతుగా బంద్ ప్రకటిస్తాం అని పిలుపునిచ్చారు.దింతో పెట్రోల్ కంపెనీలు ఆందోళన చేస్తున్నాయి.ఇప్పటికే కొన్ని బంకులో పెట్రోల్ మరియు డీజీల్ నిలువలు తగ్గిపోతున్నాయి అని నిర్వాకులు చెబుతున్నారు.
ట్యాంకర్ల
ట్యాంకర్లు ఒక రోజు బంద్ చేసినందుకు చాలా పెట్రోల్ బంకులకి సరఫరా నిలిచిపోయింది దాంతో బ్యాంకుల నిర్వాహకులు ట్యాంకర్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.కానీ వారు సమ్మెకు మద్దతు ఇస్తాము అని చెప్పారు.
వాహనదారులు
ఇది ఇలా ఉంటే జంట నగరాలలో ఇప్పటికే పెట్రోల్ మరియు డీజిల్ నిలువలు తగ్గిపోయాయి అంటా కొత్తగా వచ్చే సరుకు నిలిచిపోవడంతో రానున్న రోజుల్లో వాహనదారులు ఇబ్బంది పడక తప్పదు.
గ్రేటర్ హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ లో 2000 పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి ఒక్క్కొక్క పెట్రోల్ బంకులో 3000 లీటర్ల నుంచి 4000 లీటర్ల పెట్రోల్ అమ్ముడుపోతోంది.ఈ మొత్తం పెట్రోల్ బ్యాంకులకు దాదాపు 2500 ట్యాంకర్ల పెట్రోల్ వస్తుంది.
నో స్టాక్
కానీ గత రెండు రోజులుగా సమ్మె కారణంగా పెట్రోల్ సెరఫరా లేకపోవడంతో కొన్ని బంకులు నో స్టాక్ అని బోర్డు కూడా పెట్టాయి. సమ్మె దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ఎక్కువ పెట్రోల్ వేయించుకుంటున్నారు.