ఈరోజు మళ్ళీ ఓసారి దుమ్ములేపిన నిఫ్టీ! సరికొత్త రికార్డు.
గురువారం మార్కెట్లు చాలా సానుకూలంగా సాగాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే సెన్సెక్స్ జీవన కాల గరిష్టం 37 వేల వరకూ వెళ్లింది. అయితే ఎక్కువ సేపు ఆస్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. నిఫ్టీ సైతం 11,132 వద్ద ప్రారంభమై 11,172 వరకూ వెళ్లి మొదటిసారి ఆ స్థాయిని నమోదు చేసినట్లైంది.
సాయంత్రం క్లోజింగ్లో నిఫ్టీ సరికొత్త రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడి 36,985 వద్ద ముగియగా, నిఫ్టీ 48 పాయింట్లు జంప్ చేసి 11,179.60 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో 30లో 13 కంపెనీలు నష్టపోగా, 17 కంపెనీలు లాభాపడ్డాయి. ఎస్బీఐఎన్(5.62%),
- ఐసీఐసీఐ బ్యాంక్(4.08%),
- పవర్ గ్రిడ్(4.04%),
- ఓఎన్జీసీ(1.98%),
- భారతీ ఎయిర్టెల్(1.98%) అత్యధికంగా లాభపడగా మరో వైపు
- మారుతి(3.70%),
- యెస్ బ్యాంక్(3.61%),
- విప్రో(1.15%),
- ఏసియన్ పెయింట్స్(1.08%),
- ఎల్ అండ్ టీ(1.06%) ఎక్కువగా నష్టపోయాయి.
ఎన్ఎస్ఈలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ షేర్లు లాభపడగా.. యస్ బ్యాంక్, మారుతి సుజుకీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం షేర్లు నష్టపోయాయి.


Click it and Unblock the Notifications