ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంక్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) ప్రకటించిన తాజా జాబితాలో ఆంధ్రప్రదేశ్కు ఫస్ట్ ర్యాంక్ దక్కింది.

గత ఏడాది
గత ఏడాది ప్రకటించిన జాబితాలో తెలంగాణతో కలసి ఏపీ తొలిస్థానంలో ఉండేది. ఈ సారి ఏపీ ఒక్కటే తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణ (2), హర్యానా (3), జార్ఖండ్ (4) స్థానం దక్కించుకున్నాయి

ఈ సారి
ఈ సారి ఏపీ ఒక్కటే తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణ (2), హర్యానా (3), జార్ఖండ్ (4) స్థానం దక్కించుకున్నాయి. 2015 నుంచి వరుసగా మూడేళ్లపాటు మొదటిస్థానంలో కొనసాగిన గుజరాత్, గత ఏడాది మూడోస్థానానికి పరిమితమైంది.

అన్నిటికంటే చివరగా
ఈ ఏడాది ఆ స్థానం మరింత దిగజారి ఐదో ప్లేస్కి పడిపోయింది. ఛత్తీస్గఢ్ (6), మధ్యప్రదేశ్ (7), కర్ణాటక (8), రాజస్థాన్ (9), పశ్చిమ బెంగాల్ (10) స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ 23వ స్థానంలో నిలిస్తే, మేఘాలయకు అన్నిటికంటే చివరగా 36 ప్లేస్ దక్కింది. లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్ కూడా కింది వరుసలో నిలిచాయి.

రమేష్ అభిషేక్
ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు కిందిస్థాయికి చేరాయా అనే కోణంలో వ్యాపారవర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ర్యాంకులు నిర్ణయించినట్టు డీఐపీపీ సెక్రటరీ రమేష్ అభిషేక్ తెలిపారు.

వచ్చే ఏడాదికి
వచ్చే ఏడాదికి మరింత మెరుగ్గా ఫీడ్ బ్యాక్ సంపాదిస్తామని చెప్పారు. కేంద్రం సంస్కరణలతో దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాపార సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు

ఆర్థిక వ్యవస్థ
సులభతర వాణిజ్యానికి బాటలు వేస్తూ.. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నట్టు చెప్పారు. రాష్ట్రాల మధ్య పోటీతో రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని లెక్కలు వేస్తున్నారు.

రాకేష్ భారతి
ఇలాంటి ర్యాంకుల వల్ల రాష్ట్రాల మధ్య పోటీ తత్వం పెరుగుతుందని, మరిన్ని వ్యాపార అవకాశాలు, వసతులు, వనరులు సృష్టించేందుకు అవకాశం దొరుకుతుందని సీఐఐ అధ్యక్షుడు రాకేష్ భారతి మిట్టల్ అన్నారు

దేశం అభివృద్ధి
దాని వల్ల దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్రాల్లో సంస్కరణలు అమలు కావడం, పెట్టుబడుల ఆకర్షణతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ స్థానం కూడా మెరుగుపడింది.
కేటీఆర్
మరోవైపు తృటిలో మొదటిస్థానం కోల్పోయామని, ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆంధ్రప్రదేశ్కు అభినందనలు తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు
లోకేష్
దీనికి లోకేష్ కూడా హుందాగా స్పందించారు. ఒకటి, రెండు ఏంలేదు. తెలుగు రాష్ట్రాలే టాప్లో ఉన్నాయి. అంతా తెలుగువారి మంచికోసమే అంటూ రీ ట్వీట్ చేశారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications