ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు హిజ్రాలు ఆలయం నిర్మిస్తున్నారు. తమకు ఇచ్చిన హామీలు అమలు చేసిన దేవుడిగా హిజ్రాలు చంద్రబాబును భావిస్తున్నారు.

పెన్షన్
దీంతో ఆయనకు గుడికట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన భూమిపూజ కూడా చేశారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో హిజ్రాలకు రూ.1500 పెన్షన్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం, వారికి పెన్షన్ వచ్చేలా చూశారు.

ఇచ్చిన మాట ప్రకారం
అదే సమయంలో వారికి ఇళ్లు నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని చెప్పారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్న చంద్రబాబుకు హిజ్రాలు గుడికట్టాలని నిర్ణయించారు. ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, భూమాబ్రహ్మానందరెడ్డి, కలెక్టర్ హాజరయ్యారు

ఆలయం కోసం
చంద్రబాబు ఆలయం కోసం హిజ్రాలు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. 40 సెంట్ల భూమిలో ఈ ఆలయం నిర్మిస్తున్నారు. గుడిలో 10 కేజీల వెండి విగ్రహాన్ని (చంద్రబాబు ఆకృతిలో) తయారు చేయిస్తున్నారు.

అఖిలభారత హిజ్రాల
అఖిలభారత హిజ్రాల ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన నిధుల సేకరణ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా సహకారం తీసుకుంటున్నారు.

చంద్రబాబు కూడా
ఇప్పటికే రెండుసార్లు ఏపీ సీఎంను కలిసి ఆలయానికి సంబంధించిన వివరాలను అందించారు. చంద్రబాబు కూడా వారికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

తమకోసం రూ.20 కోట్లు
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ హిజ్రాల కోసం ప్రభుత్వాలు ఏమీ చేయలేదని, ఏపీ సీఎం ఒక్కరే తమ సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నారని హిజ్రాలు సంతోషం వ్యక్తం చేశారు. గత బడ్జెట్ లో ప్రత్యేకంగా తమకోసం రూ.20 కోట్లు కేటాయించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications