బంపర్ ఆఫర్ సర్కార్ బడిలో చేరితే బంగారు నాణెం మరియు వెయ్యి నగదు!
ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి ఆ ఊరిలో జనం ఒక గ్రాము బంగారు నాణ్యం మరియు ఒక రూ.1000 నగదు అందించారు.
అయితే అన్ని పాఠశాలలో ఈ అవకాశము లేదు అండి . ఇంతకీ ఇది ఎక్కడో తెలుసా. తంజావురు జిల్లా పేరా ఊరులో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధులకి మాత్రమే ఈ అవకాశం.
ఈ గ్రామ ప్రజలు కలిసి కస్టపడి 1998 లో బడి ఏర్పాటు చేసుకున్నారు.ప్రస్తుతం అది మదినక పాఠశాల స్థాయికి చేరుకొంది.
తమ స్కూల్ కి ఉన్నత పాఠశాలగా హోదా కలిపించాలి అని విద్యాశాఖకు ఆ ఊరి గ్రామస్థులు అర్జీ పెట్టున్నారు. అయితే 83 మంది విద్యార్థులు మాత్రమే ఉండడంతో విద్యార్థుల సంఖ్య పెరిగితే హోదా పెంచుతాం అని విద్యాశాఖ చెప్పింది.
దింతో స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి గ్రామస్థులు స్కూల్లో చేరిన ప్రతి విద్యార్థికి ఒక బంగారు నాణ్యం మరియు రూ.1000 నగదు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. దింతో 22 మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు. చెప్పిన్నట్లు విద్యార్ధులకి సోమవారం నగదు అందచేశారు.