రాష్ట్రంలో రైతుకు కూడా బీమా భరోసా దక్కనుంది. దేశంలో పంటలకు బీమా కల్పనే ఇంకా అంతంతమాత్రంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో రైతులకు వ్యక్తిగతంగా బీమా భద్రత కల్పించనున్నారు.

చంద్రన్న బీమా
అసంఘటిత రంగంలోని కార్మికులకు ఇప్పటికే చంద్రన్న బీమా పథకం అమలవుతోంది. పింఛన్లతోపాటుగా అత్యంత సంతృప్తినిస్తున్న పథకంగా చంద్రన్న బీమా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అదే తరహాలో రైతు కుటుంబాలకు కూడా రక్షణ ఉండేలా బీమా సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు

వార్షిక ఆదాయం
ఏరువాక సందర్భంగా గురువారం దీనిపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. 18 నుంచి 70 ఏళ్లు మధ్యనున్న రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. వారి వార్షిక ఆదాయం రూ.2.5లక్షలు మించి ఉండకూడదు

రైతులకు బీమా
రాష్ట్రంలో ఉన్న మొత్తం 50లక్షల మంది రైతులకు బీమా దన్ను లభిస్తుంది. చంద్రన్న రైతు బీమా పథకం కోసం కట్టాల్సిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికంగా భరిస్తుంది. మొత్తం ప్రీమియంలో రూ.21.91కోట్లు రాష్ట్ర ప్రభుత్వం.. రూ.18.70కోట్లు కేంద్రం చెల్లిస్తుంది.

ఈ పథకానికి
ఈ పథకానికి చంద్రన్న రైతు బీమా అనే పేరు పెట్టాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. పాలసీదారు చనిపోతే వారి కుటుంబానికి రూ.30వేల నుంచి రూ.5లక్షలు పరిహారం ఇస్తారు.

ఎవరైనా ప్రమాదంలో
8-50 ఏళ్లు వయసున్న రైతు సహజ మరణం పొందితే రూ.2లక్షలు ఇస్తారు. 50-60 ఏళ్లు వారైతే రూ.30వేల పరిహారం ఇస్తారు. 18-70 ఏళ్లు మధ్యవయసులోని వారు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబాలకూ రూ.5లక్షల పరిహారం అందిస్తారు.

ఏడాదికి
శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.5లక్షలు చెల్లిస్తారు. పాక్షిక అంగవైకల్యమైతే రూ.2.5లక్షలు ఇస్తారు. ఆయా కుటుంబాల్లో చదువుకుంటున్న పిల్లలుంటే వారికి ఏడాదికి రూ.1200లు ఉపకార వేతనం ఇస్తారు

రైతు బీమా ద్వారా ప్రయోజనం
తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ చదివే పిల్లలకు ఇది వర్తిస్తుంది. రాష్ట్రంలో చంద్రన్న రైతు బీమా ద్వారా ప్రయోజనం పొందనున్న 10.75లక్షల మంది రైతుల్లో ఏ వయసు వారు ఎంతమంది ఉన్నారన్న లెక్కలను ప్రభుత్వం సేకరించింది.

సర్వేలో
ఇప్పటికే అత్యధిక రైతుల ప్రజాసాధికార సర్వేలో ఉన్నారు. సర్వేలో నమోదు కానివారికీ మరో అవకాశ ం ఇస్తారు. ఈ పథకం అమలులో కార్మికశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.

10 రోజుల్లోనే
చంద్రన్న బీమా తరహాలోనే ఈ పథకంలో కూడా మరణించినవారి కుటుంబానికి 10 రోజుల్లోనే పరిహారం అందేలా నిబంధనలను రూపొందించారు. ఇప్పటికే సెర్ప్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు చంద్రన్న బీమాను బాగా అమలుచేస్తుండడంతో వారికే దీని అమలును కూడా అప్పగించాలని నిర్ణయించారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications