ఎయిర్ఇండియా అమ్మకాలు తాత్కాలికంగా నిలిపివేత?
ఎన్నికల సంవత్సరంలో ఎయిర్ ఇండియా వాటాల విక్రయంతో ముందుకు సాగకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ: ఎన్నికల సంవత్సరంలో ఎయిర్ ఇండియా వాటాల విక్రయంతో ముందుకు సాగకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కార్యకలాపాలకు అవసరమైన నిధులు ప్రభుత్వం సమకూరుస్తాయని సీనియర్ అధికారి జూన్ 19 న వెల్లడించారు.
ప్రతిపాదిత 76% శాతం కి సంబంధించి మూడువారాల క్రితం ఎయిర్ఇండియా విక్రయానికి ప్రభుత్వం పచ్చజండా ఊపినా, అందుకు తగిన బిడ్డర్స్ ఎవరూ ముందుకు రాలేదు.
ఎయిర్ ఇండియా త్వరలోనే ప్రభుత్వం నుండి రోజువారీ కార్యకలాపాలకు నిధులను పొందుతుంది అలాగే మరో రెండు విమానాల కొనుగోలుకు ఎయిర్ఇండియాకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
జూన్ 18 వ తేదీన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్న ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి తాత్కాలికంగా నియమించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఫైనాన్స్ మరియు పౌర విమానయాన శాఖల ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఎయిర్ఇండియా కార్యనిర్వాహక లాభాలను ఆర్జిస్తోందని, కంపెనీకి చెందిన విమానాలేవీ ఖాళీగా తిరగడం లేదని ప్రభుత్వఅధికారి తెలిపారు. వ్యయ నియంత్రణకు కంపెనీ పలు చర్యలు తీసుకుంటోందన్నారు. కంపెనీ సామర్ధ్యాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ సమయంలో వాటాలు విక్రయించేందుకు తొందరేమీలేదన్నారు. కంపెనీని లాభాల బాట పట్టించేందుకు యత్నిస్తామన్నారు. ఆ తర్వాత లిస్టింగ్కు వస్తామని చెప్పారు.
సెబీ నిబంధనల ప్రకారం, స్టాక్ ఎక్స్ఛేంజిలో ఒక జాబితాను నమోదు చేసుకోవడానికి ముందే ఒక సంస్థ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో లాభాన్ని నమోదు చేసుకోవాలి.
జాతీయ క్యారియర్ యొక్క 76% ఈక్విటీ షేర్ క్యాపిటల్ను, అలాగే నిర్వహణ నియంత్రణను ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడానికి ప్రభుత్వం మొదట ప్రతిపాదించింది.
ప్రస్తుతం కంపెనీ నెత్తిన దాదాపు 24వేల కోట్ల రూపాయల రుణభారం ఉంది. దీంతో బిడ్డర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎన్నికల వేళ పరువు కాపాడుకునేందుకే ప్రభుత్వం వాటా విక్రయం నుంచి వైదొలగిందని నిపుణులు భావిస్తున్నారు.
ఏదేమైనప్పటికీ, మే 31 న వేలం ప్రక్రియ పూర్తయిన తరువాత వాటాదారులని ఆకర్షించడంలో విఫలమైంది.