కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ రూ.12 కడితే రూ.2 లక్షలు...! మీరే చూడండి.
బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది అతి తక్కువ ప్రీమియంతో కేంద్రం ఒక భీమాను ప్రవేశపెట్టింది.
రూ.12 రూపాయలతో
రూ.12 రూపాయలతో సురక్ష రూ. 330 రూపాయలతో జీవన్ భీమా పాలసీ ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఇవి కూడా బ్యాంకు ఖాతాధారులకి వచ్చేలా అమలు చేసింది.
బ్యాంకు అధికారులు
మొదట గ్రామాలలోకి ఈ పాలసీలు ప్రజలలోకి వెళ్లేలా బ్యాంకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.బ్యాంకు ఖాతాధారుల నుంచి అతి తక్కవ ప్రీమియం రూ.12 కట్టించి భీమాను మొదలు పెడతారు.
ప్రమాదవశాత్తు
పాలసీ దారులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షల డబ్బును బాధిత కుటుంబాలకి అందిస్తారు.
రూ.330 ప్రీమియంగా
అలాగే రూ.330 ప్రీమియంగా కడితే జీవన్ జ్యోతి పాలసీ వర్తింపు చేస్తారు. జీవన్ జ్యోతి పాలసీలో ఈ పాలసీదారుడు సాధారణంగా మరణించిన అతను లేదా ఆమె వారి కుటుంబంలకి రూ.2 లక్షలు అందచేస్తారు.
అర్హులు
సురక్ష పాలసీకి 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్నవారు అలాగే జీవన్ జ్యోతి పాలసీకి 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులు అని కేంద్రం తెలిపింది.