ఎయిర్ టెల్ ఇలా బంపర్ ఆఫర్ ఇస్తుంది ఎందుకో తెలుసా? బీఎస్ఎన్ఎల్కు పోటీగా..
రిలయన్స్ జియో రాకతో టెలికం సంస్థల మధ్య టారిఫ్ల యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. ఒక టెలికం సంస్థ ఏదైనా రీఛార్జి ఆఫర్ తీసుకొస్తే.. దానికి పోటీగా మరో సంస్థ సరికొత్త ఆఫర్ను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా జియో, బీఎస్ఎన్ఎల్కు పోటీగా ఎయిర్టెల్ తన కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ఎక్కువగా వాయిస్కాల్స్ మాట్లాడుకునే వారికి ఉపయోగపడుతుంది.
ఎయిర్టెల్ తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు రూ.597 రీఛార్జిను ప్రవేశపెట్టింది. దీని కింద యూజర్లు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్ అవుట్గోయింగ్ కాల్స్ను పొందవచ్చు. దీంతో పాటు రోజుకు వంద ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. అంతేకాదు.. 10జీబీ డేటాను ఇచ్చింది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 168రోజులు. కాల్స్, డేటా వినియోగంపై ఎటువంటి పరిమితులు లేవు. ఎక్కువ సమయం కాల్స్ మాట్లాడుకునే వారిని దృష్టిలో ఉంచుకొని ఎయిర్టెల్ ఈ ఆఫర్ను తీసుకొచ్చింది.
రంజాన్ పండుగ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఎస్టీవీ 786 రీఛార్జికు పోటీగా ఎయిర్టెల్ ఈ ఆఫర్ను తీసుకొచ్చింది. 150 రోజుల వ్యాలిడిటీతో ఎస్టీవీ 786 ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్లు ఇస్తోంది. లాంగ్టర్మ్ ప్లాన్ కింద జియో కూడా రూ.999 రీఛార్జిని తీసుకొచ్చింది. 90 రోజుల కాల పరిమితితో, 60జీబీ డేటా, అపరిమిత లోకల్ కాల్స్, ఉచిత ఎస్ఎంఎస్లను జియో అందిస్తోంది.