ప్రపంచంలో మొట్ట మొదట విద్యుత్ ఆధారిత వాహనాలు తిరుపతి ఆలయం లో?

దాదాపు 50 ఎలక్ట్రిక్ కార్లు తిరుమల తిరుపతి దేవస్థానం లో (టిటిడి) ఉపయోగించనున్నారు మరియు మొత్తం 350 వాహనాలను EESL ద్వారా ఆంధ్రప్రదేశ్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది.

దాదాపు 50 ఎలక్ట్రిక్ కార్లు తిరుమల తిరుపతి దేవస్థానం లో (టిటిడి) ఉపయోగించనున్నారు మరియు మొత్తం 350 వాహనాలను EESL ద్వారా ఆంధ్రప్రదేశ్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది విద్యుత్ కార్లలో ప్రయాణం చేయడానికి ఖరీదు కిలోమీటరుకు రూ.2 రూపాయలకన్నా తక్కువగా ఉంటుంది.

తిరుమల తిరుపతి:

తిరుమల తిరుపతి:

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి), దాని అధికారుల రోజువారీ ప్రయాణానికి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించుకునే ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయం. రాష్ట్రంలోని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఎస్ఇఎల్) ఆంధ్ర ప్రభుత్వం కి 350 కార్లను అందజేసింది ప్రభుత్వం EV పాలసీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయనుంది.తిరుమల ఆలయంలో TTD అధికారులు ఉపయోగించేందుకు ఈ 50 ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉంటాయి.

ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL):

ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL):

ఎం.ఎ. కమలాకర్ బాబు, ఎం.డి., న్యూ మరియు రినవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్.ఆర్.ఆర్.సి.ఎ.పి) లో మాట్లాడుతూ, "ఎలక్ట్రిక్ వాహనాలు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) నుండి ఒక నెలవారీ చెల్లింపుగా నియమించేందుకు ఒప్పందం చేసుకున్నారు . ప్రారంభంలో, టిటిడితో సహా, ఎంచుకున్న ప్రాంతాల్లో 50 వాహనాలను నియమించబోతున్నాం అన్నారు. "ప్రతి నెలా కార్పొరేషన్ EESL కి రూ. 20,000 చెల్లించాలి మరియు డ్రైవ్ మరియు నిర్వహణ వ్యయాలను చూసుకునే విభాగానికి మరొక రూ .20,000 / ఇవ్వాలి.

ఎలక్ట్రిక్ వాహనాలను డ్రైవ్ చేయడానికి

ఎలక్ట్రిక్ వాహనాలను డ్రైవ్ చేయడానికి

ఈ ఎలక్ట్రిక్ వాహనాలను డ్రైవ్ చేయడానికి నియమించిన డ్రైవర్లకు కొత్త వాహనంలో బ్యాటరీలు మరియు గేర్లు ఎలా ఉపయోగించాలి అనే దానిపై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రతి కారు ఖర్చు 11 లక్షలు మరియు ఆరు సంవత్సరాల తర్వాత ఈ వాహనాల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబడుతుంది. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ (టిఎంసి), గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జివిఎంసి), అమరావతిలోని సెక్రటేరియట్లతో సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విద్యుత్ వాహనాల అభివృద్ధిని చూడవచ్చు.

ఛార్జింగ్ పరికరాలు సరఫరా:

ఛార్జింగ్ పరికరాలు సరఫరా:

EESL నిబంధనల ప్రకారం, ఛార్జింగ్ పరికరాలు సరఫరా చేయడానికి AP ఈస్టర్న్ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APEPDCL) ఇప్పటికే విక్రయదారులను ఖరారు చేసింది. తిరుపతి ఆలయంలో ఎలక్ట్రిక్ కార్లను నడపడానికి ఖర్చు కిలోమీటరుకు రెండు రూపాయలకన్నా తక్కువగా ఉంటుంది. పూర్తి ఛార్జ్ ఉన్న ఈ ఎలక్ట్రిక్ కార్లు (టాటా టిగోర్ ఎలక్ట్రిక్, మహీంద్రా ఇ-వెరిటో)దాదాపు 120 కిలోమీటర్ల ప్రయాణించగలవు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+