వాటర్ బాటిల్స్ తో ఇలా చేస్తే పేటియంలో డబ్బులు ఫ్రీగా వచ్చి పడుతాయి!
ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల వాతావరణానికి నష్టాన్ని తగ్గించేందుకు భారతీయ రైల్వే శాఖ ఒక వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది.గుజరాత్ లోని వడోదర రైల్వే స్టేషన్ ఇందుకు వేదిక అయ్యింది.
వడోదర
వడోదర రైల్వే స్టేషన్ నుంచి రోజుకు కొన్ని వందలమంది ప్రయాణిస్తుంటారు. సహజంగానే రైల్వే స్టేషన్ అంటే ప్లాస్టిక్ బాటిల్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. వాడేసిన బాటిల్లు ఎక్కడ పడితే అక్కడ మనకు దర్శనం ఇస్తుంటాయి.
ప్లాస్టిక్ బాటిల్లు
కానీ వడోదర రైల్వే స్టేషన్ లో వాడేసిన ప్లాస్టిక్ బాటిల్లు క్రషర్లను ఏర్పాటు చేశారు. అయితే చెత్త బుట్టలు ఉన్న వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ పడేసే ఈరోజుల్లో బాటిల్ క్రషర్లను ఎంత మాత్రం ఉపయోగిస్తారు అని మనకు సందేహం రావచ్చు.
పడేసిన బాటిల్ వేస్తే
అందుకే రైల్వే శాఖ కొంచెం కొత్తగా ఆలోచింది. బాటిల్ క్రషర్లో తాగి పడేసిన బాటిల్ వేస్తే రూ.5 చెప్పున మీ పేటియం ద్వారా వస్తాయి అని రైల్వే శాఖ ప్రకటించింది.
మొబైల్ నెంబర్
దీనికి చేయవలసింది అంత ఒకటే సంబంధిత మొబైల్ నెంబర్ ను ఆ క్రషర్ మిషన్ లో ఎంటర్ చేస్తే చాలు.