చిల్లర డబ్బులతో కారు కొనడానికి షోరూంకి వెళ్ళాడు.. ఆ తర్వాత ఏంజరిగిందో తెలుసా?
వంద వద్దు యాభై వద్దు ఇరవై వేలా వద్దేవద్దు అని రూ.500 రూ.2000 మాత్రమే ఇంట్లో దాచుకునే ప్రజలు ఇప్పుడు చిల్లర నోట్లను దాచాలని అనుకుంటున్నారు.
ఇళ్లలో హుండీలు
ఏదేమైనా పాత పద్ధతులే మంచివి అంటూ ఆ రోజులు తలుచుకుంటూ బాధపడుతున్నారు. పూర్వం పెద్ద ఇళ్లలో ఇనుప పెట్టలు ఉండేవి అదే చిన్న ఇళ్లలో హుండీలు ఉండేవి. ఇంటి పెద్ద పిల్లలకు అలవాటు చేయడానికి ఒక్కొక్కరికి ఒక హుండీ ఇచ్చి చిల్లర దాచుకోవడం అలవాటు చేసేవారు.
నాణ్యాలు సేకరిస్తుండేవారు
పిల్లలు కూడా కొత్త బట్టలకు, పుస్తకాలకు సంత్సరం అంతా నాణ్యాలు సేకరిస్తుండేవారు. ఆడవాళ్లు దేవుళ్లకు , తీర్థయాత్రలకు ముడుపులు కట్టి తోచిన చిల్లర అంతా దానిలో వేసి ఆ సమయానికి వాటిని తీసి ఉపయోగించేవారు.
కొత్త నాణ్యాలు మరియు కొత్త నోట్లు కనిపిస్తే
బంధువులు ఇళ్ళకి వస్తే ఎప్పటిలాగా తిను బండారాలు తెచ్చిపెట్టకుండా పిల్లలకు చిల్లర కానుకగా ఇచ్చేవారు ప్రముఖంగా ఆ కాలంలో కొత్త నాణ్యాలు మరియు కొత్త నోట్లు కనిపిస్తే పొరపాటున కూడా ఖర్చు పెట్టేవారు కాదు.వాటిని అపూరూపంగా దాచుకొనే పద్దతి మధ్యతరగతి కుటుంబంలో ఉండేవి.
ఎందుకు చెబుతున్నా
ఇంట్లో చిల్లర ఉండే సంస్కృతి ఉంది ఉంటె ఈ బాధ ఉండేది కాదు కదా కుయ్ మంటున్నవారు కూడా ఉన్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా?
వివరాల్లోకి వెళితే
ఇక వివరాల్లోకి వెళితే చిల్లర డబ్బులో చైనాకు సంబంధించిన వ్యక్తి ఏకంగా BMW కారు కొని అందరిని ఆశ్యర్యపరిచాడు.వినడానికి కూడా కొంచెం షాకింగ్ గా ఉంది కాదు.
రూ.40 లక్షల విలువైన
చిన్నాచితకా పనిలు చేసుకుంటూ నాణ్యాలు దాచుకున్న ఆ వ్యక్తి ఒక షో రూమ్ కి వెళ్లి BMW కారు గురించి ఆరాదీశాడు. కార్లు అన్ని చుసిన అతను చివరికి రూ.40 లక్షల విలువైన కారును కొనదలిచాడు.
తొలి విడతగా
డబ్బు చెల్లింపు భాగంగా తొలి విడతగా రూ.6.80 లక్షల రూపాయిలు చిల్లర రూపంలో చెల్లిస్తాను అని షో రూమ్ సిబ్బందికి వారు చెప్పడంతో వారు అంతా అవాక్ అయ్యారు. ఈ చిల్లర చెల్లింపు పై తొలుత వద్దు అన్నారు. కస్టమర్లని పోగొట్టుకోవడం ఇష్టం లేక చివరికి సరే అన్నారు.
పది డబ్బాలు నిండిన
దింతో మొత్తం పది డబ్బాలు నిండిన చిల్లరని షో రూంలో నేలపై పోసి లెక్కించే సరికి అందరికి నడుమునొప్పి వచ్చింది అంటా.