దేశం లో మొట్టమొదటి హెలికాప్టర్ అంబులెన్సు తెలుగు రాష్ట్రం లో ప్రారంభించారు?
వింగ్స్ ఏవియేషన్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కు సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని కంపెనీ భావిస్తోందని వచ్చే ఏడాది లో ఆరు హెలికాప్టర్లను అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడ
వింగ్స్ ఏవియేషన్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కు సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని కంపెనీ భావిస్తోందని వచ్చే ఏడాది లో ఆరు హెలికాప్టర్లను అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించారు.

హైదరాబాద్: ఈ నగరం లో ప్రస్తుతం దేశంలో మొట్టమొదటి 24/7 ప్రైవేటు ఎయిర్ అంబులెన్స్ సర్వీస్ కి నిలయమైనది. అగస్టా హెలికాప్టర్ శనివారంనాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లిలో అధికారికంగా ప్రవేశపెట్టిన మాక్ డ్రిల్ను నిర్వహించింది. ఎయిర్ ఎయిడ్ అని పిలవబడే ఈ సేవను నగరం-ఆధారిత ప్రైవేటు సంస్థ వింగ్స్ ఏవియేషన్ అందించనుంది.
ఈ ప్రాజెక్టుకు రూ. 150 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వింగ్స్ ఏవియేషన్ చైర్మన్ వై.ప్రభాకర్ రెడ్డి చెప్పారు. వచ్చే ఏడాదిలో ఈ సర్వీసులో ఆరు హెలికాప్టర్లు అందుబాటులో కి రానున్నాయి. సంస్థ మొదట ఒక్క విమానం మాత్రమే కలిగి ఉంది, ఇది రెండు తెలుగు రాష్ట్రాలు మరియు సరిహద్దు లో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకు కూడా ఇది సేవలు అందిస్తుంది.
ఈ సదుపాయం కోసం గంటకు 1.50 లక్షల రూపాయలు వసూలు చేయనుంది. ప్రభుత్వ శాఖలు, కార్పోరేట్ ఆసుపత్రులతో చర్చలు జరుగుతున్నాయి.

సేవ కోసం సబ్సిడీని కోరుతూ మా ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూల ప్రతిస్పందనను ఇచ్చింది, అయితే ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సిఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు,మరియు అనేక పెద్ద కార్పోరేట్ ఆసుపత్రులతో చర్చలు జరిపిన వివిధ దశలలో ఉన్నాం అన్నారు.ఈ సేవ ద్వారా ప్రభుత్వాలు, పోలీసు విభాగాలు, కార్పోరేట్ ఆసుపత్రులు, అవయవ దానం పొందేవారు లబ్ది పొందుతారు అని రెడ్డి చెప్పారు.
ఛాపర్ 450 కిలోమీటర్ల నాన్ స్టాప్ గా ఎగురుతుంది, దాని తరువాత ఇంధనం అవసరం పడుతుంది. హైదరాబాద్ దేశంలోని అనేక ప్రాంతాల్లో సేవలు అందించడానికి ఒక ఎయిర్ అంబులెన్స్ కోసం వ్యూహాత్మకంగా ఉంచింది, ఈ సేవను మొదటిసారి దక్షిణ రాష్ట్రాలలో అమలు చేసి మరియు చివరికి ఉత్తర రాష్ట్రాలకు విస్తరించాలని ఆయన అన్నారు.
మాక్ డ్రిల్ మరియు ప్రయోగ కార్యక్రమాల్లో, పిల్లల తో సహా అనేక కుటుంబాలు, చాపర్ ల్యాండ్ మరియు ఎయిర్ అంబులెన్స్ లోపల వైద్యులు రోగి' కి 'చికిత్స' చేసే విదాన్నని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసారని అన్నారు.
రహదారి ప్రమాదాలు, కార్డియాక్ ట్రామా, ఆర్తోపెడిక్ ఆవశ్యకతలు, అవయవ మార్పిడి వంటి కేసులను నిర్వహించేందుకు అత్యవసర వైద్య పరికరాన్ని చోపర్ తగినంతగా కలిగి ఉందన్నారు.


Click it and Unblock the Notifications