ఈ నెల 30, 31 తేదీల్లో సమ్మెకు దిగుతున్నట్టు బ్యాంకు ఉద్యోగు సంఘాల నేతలు(యూఎఫ్బీయూ) ప్రకటించారు. వేతన సవరణను సమీక్షించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

సమ్మెకు పిలుపునిచ్చాయి
బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలతో బ్యాంక్ యాజమాన్యాలు చర్చించాయి. కానీ, ఈ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ విషయమై కేంద్రం జోక్యం చేసుకోవాలని కూడ బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్స్ నేతలు డిమాండ్ చేశారు.

పనిదినాలు
15 శాతం వేతన సవరణ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా వారానికి ఐదు రోజుల పనిదినాలు, ఉద్యోగులకు పనిభారం తగ్గించడం వంటివి డిమాండ్లలో మరికొన్ని.

2 శాతం మాత్రమే
కానీ, కేవలం 2 శాతం మాత్రమే వేతనాలు పెంచేందుకు బ్యాంకు యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. అయితే 30% వేతన పెంపునకు ఇంతకుముందే ఐబీఏ అంగీకరించి వెనక్కు తగ్గడంపై బ్యాంకు ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు.

పీఆర్సీ
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఉన్నట్లే తమకు కావాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీంతో బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది. మరో వైపు పారిశ్రామిక వేత్తలు బ్యాంకులకు వేలాది కోట్లు రుణాలుగా తీసుకొని ఎగ్గొట్టడం వల్ల బ్యాంకులు నష్టాలబారినపడుతున్నాయి.

మే 30, 31 తేదిల్లో
ఉద్యోగులను విభజించి పబ్బం గడుపుకొనేందుకు పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారని బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ నేతలు ఆరోపిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా మే 30, 31 తేదిల్లో రెండు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయమేర్పడనుంది. జూన్ 1వ తేదిన బ్యాంకులు తెరుచుకోనున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications