టిసిఎస్ స్క్రిప్ట్స్ చరిత్ర, 100 బిలియన్ డాలర్లను క్యాప్ చేసిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా పేరు గాంచింది.ఐటీ దిగ్గజం టిసిఎస్ సోమవారం చరిత్ర సృష్టించింది.
టిసిఎస్ స్క్రిప్ట్స్ చరిత్ర, 100 బిలియన్ డాలర్లను క్యాప్ చేసిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా పేరు గాంచింది.

ఐటీ దిగ్గజం టిసిఎస్ సోమవారం చరిత్ర సృష్టించింది. ఈ జాబితాలో 100 బిలియన్ డాలర్ల విలువైన మొట్టమొదటి భారతీయ కంపెనీగా నిలిచింది.
ఉదయం 09:49 కంపెనీ మార్కెట్ విలువ రూ. 6,62,726.36 కోట్లకు చేరింది. 11.30 గం.ల సమయానికి కంపెనీ షేర్ 2.28% పెరిగి 78 రూపాయల లాభంతో 3479 వద్ద ట్రేడవుతోంది.
శుక్రవారం 10 వేల కోట్ల డాలర్ల మార్క్కు రూ.7,917.08 కోట్ల దూరంలో నిలిచింది. ఈ మైలురాయికి చేరుకున్న తొలి భారతీయ సంస్థ టీసీఎస్ కావడం విశేషం. ఈ ఏడాది జనవరి 24న సంస్థ తొలిసారిగా రూ.6 లక్షల కోట్ల మార్క్ను దాటింది. ఇంట్రాడేలో 7.22 శాతానికి పైగా లాభపడి 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకిన కంపెనీ షేరు ధర వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 6.76 శాతం లాభంతో రూ.3,406.40 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈలో 6.62 శాతం ఎగబాకి రూ.3,402.45 వద్దకు చేరుకున్నది. టీసీఎస్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్(రూ.5,87,929.90 కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(రూ.5,08,884.23 కోట్లు), ఐటీసీ(రూ.3,36,777 కోట్లు), హెచ్యూఎల్ (రూ.3,17,211.69 కోట్లు)లు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి.
ఐటీ రంగ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరులు మొగ్గుచూపడంతో ఈ రంగ షేర్లు నాలుగు శాతానికి పైగా పుంజుకున్నాయి. టెక్ మహీంద్రా 2.48%, హెచ్సీఎల్ టెక్నాలజీ షేర్ 2.41% లాభపడగా ఇన్ఫోసిస్ (-4.45%) , విప్రో(-3.40%) శాతం చొప్పున నష్టాల్లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications