నిరవ్ మోడీ పీఎన్బీ లో కుంభకోణానికి సంబంధించి పక్కా ఆర్బిఐ ఆడిటింగ్ లేకపోవడం కూడా ఒక కారణం అని కేంద్ర విజిలెన్సు కమిషనర్( సివిసి) కేవీ చౌదరి విమర్శించారు.
నిరవ్ మోడీ పీఎన్బీ లో కుంభకోణానికి సంబంధించి పక్కా ఆర్బిఐ ఆడిటింగ్ లేకపోవడం కూడా ఒక కారణం అని కేంద్ర విజిలెన్సు కమిషనర్( సివిసి) కేవీ చౌదరి విమర్శించారు.కుంభకోణం జరిగిన సమయంలో ఆర్బిఐ చేసిన దర్యాప్తు లో నిర్లక్ష్యం వహించారని ఆడిటింగ్ సరిగా లేదని అన్నారు.పటిష్టమైన ఆడిటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు.

బ్యాంకింగ్ రంగానికి సంబంధించి నియంత్రణ బాధ్యతలు ఆర్బీఐకి ఉన్నప్పటికీ ఆ విషయంలో చిత్తశుద్ధి లోపిస్తే సీవీసీ పర్యవేక్షిస్తుందన్నారు. ''రిస్క్ను గుర్తించేందుకు వారికంటూ కచ్చితంగా కొన్ని కొలమానాలు ఉండాలి.
కానీ, అంత పెద్ద ఆర్థిక మోసాలు జరుగుతున్న సమయంలో ఆర్బీఐ నుంచి సరైన ఆడిటింగ్ లేదు. ఆర్బీఐ ఏటా కాకుండా రిస్క్ ఆధారిత ఆడిగింగ్ చేస్తోంది. ఇది మంచి విధానమే. కానీ, వారు రిస్క్ను ఎలా కొలుస్తారు. కుంభకోణాలు ఎందుకు బయటకు రావడం లేదు''అని చౌదరి అన్నారు. ఆర్బీఐ సాధారణ మార్గదర్శకాలను జారీ చేస్తోంది తప్ప బ్యాంకు శాఖల వారీగా పరిశీలన చేయడం లేదన్నారు.
నైతిక విలువలతో, సక్రమంగా వ్యాపారం చేయడమన్నది బ్యాంకుల ప్రాథమిక బాధ్యతగా చౌదరి గుర్తు చేశారు. పీఎన్బీకే కుంభకోణాలు పరిమితం కాలేదన్న ఆయన బ్యాంకింగ్ రంగానికి మెరుగైన వ్యవస్థ అవసరమని, ఆ వ్యవస్థను అవి అనుసరించాలని సూచించారు. ''కచ్చితమైన సమయ పాలన ఉండాలి.
నిఘా యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాలి. మార్గదర్శకాలు, నిర్వహణ విధానాన్ని కూడా బలోపేతం చేయాలి. వాటిని అవి అనుసరించేలా చూడాలి'' అని చౌదరి పేర్కొన్నారు. పీఎన్బీ, ఆర్బీఐకి సంబంధించి చాలా అంశాలు సీవీసీ పరిశీలనలో ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సీవీసీ కేవీ చౌదరి.


Click it and Unblock the Notifications