నిరవ్ మోడీ పీఎన్బీ లో కుంభకోణానికి సంబంధించి పక్కా ఆర్బిఐ ఆడిటింగ్ లేకపోవడం కూడా ఒక కారణం అని కేంద్ర విజిలెన్సు కమిషనర్( సివిసి) కేవీ చౌదరి విమర్శించారు.
నిరవ్ మోడీ పీఎన్బీ లో కుంభకోణానికి సంబంధించి పక్కా ఆర్బిఐ ఆడిటింగ్ లేకపోవడం కూడా ఒక కారణం అని కేంద్ర విజిలెన్సు కమిషనర్( సివిసి) కేవీ చౌదరి విమర్శించారు.కుంభకోణం జరిగిన సమయంలో ఆర్బిఐ చేసిన దర్యాప్తు లో నిర్లక్ష్యం వహించారని ఆడిటింగ్ సరిగా లేదని అన్నారు.పటిష్టమైన ఆడిటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు.

బ్యాంకింగ్ రంగానికి సంబంధించి నియంత్రణ బాధ్యతలు ఆర్బీఐకి ఉన్నప్పటికీ ఆ విషయంలో చిత్తశుద్ధి లోపిస్తే సీవీసీ పర్యవేక్షిస్తుందన్నారు. ''రిస్క్ను గుర్తించేందుకు వారికంటూ కచ్చితంగా కొన్ని కొలమానాలు ఉండాలి.
కానీ, అంత పెద్ద ఆర్థిక మోసాలు జరుగుతున్న సమయంలో ఆర్బీఐ నుంచి సరైన ఆడిటింగ్ లేదు. ఆర్బీఐ ఏటా కాకుండా రిస్క్ ఆధారిత ఆడిగింగ్ చేస్తోంది. ఇది మంచి విధానమే. కానీ, వారు రిస్క్ను ఎలా కొలుస్తారు. కుంభకోణాలు ఎందుకు బయటకు రావడం లేదు''అని చౌదరి అన్నారు. ఆర్బీఐ సాధారణ మార్గదర్శకాలను జారీ చేస్తోంది తప్ప బ్యాంకు శాఖల వారీగా పరిశీలన చేయడం లేదన్నారు.
నైతిక విలువలతో, సక్రమంగా వ్యాపారం చేయడమన్నది బ్యాంకుల ప్రాథమిక బాధ్యతగా చౌదరి గుర్తు చేశారు. పీఎన్బీకే కుంభకోణాలు పరిమితం కాలేదన్న ఆయన బ్యాంకింగ్ రంగానికి మెరుగైన వ్యవస్థ అవసరమని, ఆ వ్యవస్థను అవి అనుసరించాలని సూచించారు. ''కచ్చితమైన సమయ పాలన ఉండాలి.
నిఘా యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాలి. మార్గదర్శకాలు, నిర్వహణ విధానాన్ని కూడా బలోపేతం చేయాలి. వాటిని అవి అనుసరించేలా చూడాలి'' అని చౌదరి పేర్కొన్నారు. పీఎన్బీ, ఆర్బీఐకి సంబంధించి చాలా అంశాలు సీవీసీ పరిశీలనలో ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సీవీసీ కేవీ చౌదరి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications