రానున్న రోజుల్లో హీరో కంపెనీ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం?
ఆంధ్ర ప్రదేశ్ లో హీరో కంపెనీ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది.భవిష్యత్ కాలమంతా విద్యుత్ వాహనాలదే హావ అని పేర్కొంది.దక్షిణాదిలో మొట్టమొదటి ప్లాంటు త్వరలో ప్రారంభం కానుంది.దీనికి గాను 600 కోట్లు బ
ఆంధ్ర ప్రదేశ్ లో హీరో కంపెనీ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది.భవిష్యత్ కాలమంతా విద్యుత్ వాహనాలదే హావ అని పేర్కొంది.దక్షిణాదిలో మొట్టమొదటి ప్లాంటు త్వరలో ప్రారంభం కానుంది.దీనికి గాను 600 కోట్లు బెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ వెల్లడించింది.
హీరో మోటార్స్ కు చంద్ర బాబు శంకుస్థాపన చేసారు,ఆంధ్ర ప్రదేశ్ ఒక పెట్టుబడులకు నిలయం అని ముఖ్యమంత్రి అన్నారు.పెట్టుబడులు పెట్టే ప్రతిఒక్కరు మాకు ఆత్మీయులే అన్నారు.
ఇప్పటికే అనంతపురానికి కియా సంస్థ వచ్చిందని,చిత్తూరు కు హీరో మోటోకార్స్ తో పాటు రిలయన్స్ జియో,అరవింద్ సెల్కాన్.కార్బన్ వంటి పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయన్నారు.ఈ ప్రాంతాన్ని ఒక లాజిస్టిక్ హబ్ గా తాయారు చేయడమే మా లక్ష్యం అన్నారు.
భవిష్యత్ మొత్తం విద్యుత్ వాహనాలదేనని దీని పై హీరో ద్రుష్టి సారించాలని చెంద్రబాబు నాయుడు సూచించారు.చిత్తూరు జిల్లా సత్యవేడు శ్రీ సిటీ సమీపంలో మధనపాలెం సమీపంలో 636 ఎకరాల్లో నిర్మించబోయే హీరో మోటోకార్స్ మొదటిదశ పనులకు శుక్రవారం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసారు.
ఈ ప్రాంతానికి కొత్త కల వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు,ప్రత్యక్షంగా పరోక్షంగా 12 మందికి వుద్యోగాలు రానున్నాయని ఆయన పేర్కొన్నారు.