పంజాబ్ నేషనల్ బ్యాంకు లో 11 ,300 కోట్ల కుంభకోణానికి కారణమైన నిరవ్ మోడీ ఆస్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.నిరవ్ మోడీ కి సంబంధించి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ సుమారు 5 ,
పంజాబ్ నేషనల్ బ్యాంకు లో 11 ,300 కోట్ల కుంభకోణానికి కారణమైన నిరవ్ మోడీ ఆస్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.నిరవ్ మోడీ కి సంబంధించి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ సుమారు 5 ,100 కు పైమాటే అని వెల్లడించింది.
హైదరాబాద్, గుజరాత్ తదితర ప్రాంతాల్లోని నీరవ్ మోదీ ఇండ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాల్లో ఈడీ విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఇందులోభాగంగానే రూ.5,100 కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

నీరవ్ మోదీ, అతని కుటుంబ సభ్యులు, కంపెనీలకు చెందిన 29 ఆస్తులను, 105 బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ జప్తు చేసింది. నీరవ్ మోదీ, ఆయన భార్య అమీ, సోదరుడు నిషాల్, వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీలపై రూ.280 కోట్ల మోసానికి సంబంధించి బుధవారం ఈడీకి పీఎన్బీ ఫిర్యాదు చేసింది.
విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కొన్నందుకు నల్లధనం నిరోధక చట్టం కింద నీరవ్ మోదీపై కేసు నమోదు చేసింది. నీరవ్కు సింగపూర్లో ఆస్తులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేరం రుజువైతే ఆస్తిని సొంతం చేసుకోవడమే కాకుండా 120 శాతం అదనంగా పన్ను విధిస్తారు.
ముంబై, ఢిల్లీ, సూరత్, జైపూర్లలోని ఆస్తులన్నీ జప్తు చేశారు. ఆదాయ పన్ను కేసులన్నింటిపైనా అదనంగా ఈడీ మనీలాండరింగ్ కేసులు నమోదు చేసింది. నీరవ్ మోదీ బృందాన్ని తన ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 549 కోట్ల రూపాయల విలువైన వజ్రాలను ఈడీ తాజాగా స్వాధీనం చేసుకుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదుపై జనవరి 31న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను విస్తృతం చేస్తూ సీబీఐ గీతాంజలి గ్రూప్ మీద ఎఫ్ఐఆర్లో చేర్చింది. హైదరాబాద్ సహా దేశంలోని 20 నగరాల్లో ఉన్న గీతాంజలి నగల దుకాణాలపై దాడిచేసి, సోదాలు జరిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications