బడ్జెట్ దెబ్బ స్మార్ట్ ఫోన్ అబ్బా
స్మార్ట్ ఫోన్లకు ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు,కెమెరా మోడ్యూల్స్,డేస్ ప్లేల పై రానున్న బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలను విధించే యోచనో కేంద్రం అడుగులు .
రానున్న బడ్జెట్ లో ఎలక్ట్రానిక్ ఉపకారణాలపై భారీగా సుంకాలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.స్మార్ట్ ఫోన్లకు ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు,కెమెరా మోడ్యూల్స్,డేస్ ప్లేల పై రానున్న బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలను విధించే అవకాశం ఉంది.
స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా పెంచే యోచనలో కేంద్రం
స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా పెంచే యోచనలో కేంద్రం రానున్న బడ్జెట్ లో ప్రవేశపెట్టనుంది.పీసీబీలు, కెమెరాలు, డిస్ ప్లేల ధరలు పెరిగే అవకాశం ఉంది ,తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అంటున్న కేంద్రం.దేశాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో ఆయా పరికరాలపై కేంద్రం కస్టమ్స్ సుంకం విధిస్తోందని పేర్కొన్నారు.ఇదే జరిగితే స్మార్ట్ ఫోన్లు,లాప్టాప్ లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకారణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కస్టమ్స్ రిజిడ్ ఇన్ బడ్జెట్ 2018
ప్రధాన మంత్రి బీమా యోజన ద్వారా మీ జీవితానికి సురక్ష
మేక్ ఇన్ ఇండియా భాగంలో
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, భారతదేశం ఒక తయారీ కేంద్రంగా కాకుండా, వస్తువుల సామూహిక గమ్యస్థానంగా ఉండాలని యోచిస్తోంది. భారతదేశంలో ఇంజనీరింగ్ రంగం విదేశీ ఆటగాళ్ళ నుండి ఎంతో ఆసక్తిని ఆకర్షిస్తుంది, ఉత్పాదక ఖర్చులు, సాంకేతికత మరియు ఆవిష్కరణల విషయంలో ఇది అద్భుతమైన ప్రయోజనాన్ని సాధిస్తాయని,నేడు, అనేక రంగాల్లో భారతీయ తయారీ కంపెనీలు ప్రపంచ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి మరియు ప్రపంచవ్యాప్తంగా పోటీపడుతున్నాయి.
దేశంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య
భారతదేశంలో సుమారు వంద కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారని US- ఆధారిత మీడియా సంస్థ జెనిత్ ఒక అధ్యయనంలో తెలిపిన ప్రకారం,భారతదేశంలో ప్రస్తుతం 300-400 మిలియన్ స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉండవచ్చని అంచనా వేసింది.దేశంలో దాదాపు 600 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉండగా,వారిలో 300 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు.కౌంటర్ పాయింట్ ప్రకారం భారతదేశం లో ప్రతి ముగ్గురి లో ఇద్దరు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు.