For Quick Alerts
For Daily Alerts
వారాంతంలో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
వారాంతంలో మార్కెట్లు మదుపరి మోమున సంతోషాన్ని మిగిల్చాయి. మిడ్ సెషన్ నుంచీ ఊపందుకున్న కొనుగోళ్లతో మార్కెట్లు వారాంతాన సరికొత్త రికార్డులను అందుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 35,542 వద్ద గరిష్టాన్
|
వారాంతంలో మార్కెట్లు మదుపరి మోమున సంతోషాన్ని మిగిల్చాయి. మిడ్ సెషన్ నుంచీ ఊపందుకున్న కొనుగోళ్లతో మార్కెట్లు వారాంతాన సరికొత్త రికార్డులను అందుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 35,542 వద్ద గరిష్టాన్ని తాకగా.. నిఫ్టీ మార్కెట్ చరిత్రలో తొలిసారి 10,900 మార్క్ను అధిగమించింది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 251 పాయింట్లు జంప్చేసి 35,511ను తాకగా.. నిఫ్టీ 78 పాయింట్లు ఎగసి 10,895 వద్ద స్థిరపడింది. వెరసి సెన్సెక్స్ 35,500 మార్క్కు ఎగువన స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ వాటిలో అదానీ పోర్ట్స్ (+ 4.68 శాతం), యెస్ బ్యాంక్ (+ 2.37 శాతం) ఐసిఐసిఐ బ్యాంక్ (+ 2.15 శాతం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.08 శాతం), టిసిఎస్ (+ 1.53 శాతం)ముందుండగా , మరో వైపు ఇన్ఫోసిస్ (-0.82%), సన్ ఫార్మా (-0.74%), పవర్గ్రిడ్ (-0.61%), మారుతి (-0.4%) మరియు ఓఎన్జిసి (-0.23%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
Comments
English summary
వారాంతంలో లాభాల్లో ముగిసిన మార్కెట్లు | markets ended positively on the week end trading
Story first published: Friday, January 19, 2018, 16:43 [IST]