కొత్త సంవత్సరంలో విమాన టిక్కెట్ల ఆఫర్ ప్రకటించిన ఇండిగో
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కొత్త సంవత్సరం సందర్భంగా విమాన టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇండిగో వెబ్సైట్లో ఉంచిన ధరల ప్రకారం ఢిల్లీ నుంచి లక్నో టిక్కెట్ ప్రారంభ ధర రూ.1030గా, కొయంబ
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కొత్త సంవత్సరం సందర్భంగా విమాన టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇండిగో వెబ్సైట్లో ఉంచిన ధరల ప్రకారం ఢిల్లీ నుంచి లక్నో టిక్కెట్ ప్రారంభ ధర రూ.1030గా, కొయంబత్తూర్ నుంచి చెన్నై విమాన ప్రయాణానికి రూ.1095 టిక్కెట్ ధరను నిర్ణయించింది. ప్రతి ప్రయాణికుడు కన్వీనియన్స్ ఫీజు కింద రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా టిక్కెట్ సొమ్మును చెల్లించేటప్పుడు దీన్ని వసూలు చేస్తారని ఇండిగో వెబ్సైట్లో పేర్కొంది.
జనవరి నెలలో అందుబాటులో ఉన్న చాలా టిక్కెట్లకు ధర రూ.1005గా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. బగోఢా నుంచి గౌహతి మధ్య జనవరి 11వ తేదీ ప్రయాణానికి టిక్కెట్ ధరలను రూ.1005గా నిర్దారించినట్లు ఇండిగో వెబ్సైట్ పేర్కొంది.
ఆఫర్
ప్రకారం
ఉన్న
టిక్కెట్లు
ఎక్కువ
శాతం
జనవరి
బుకింగ్స్
మాత్రమే
అందుబాటులో
ఉంటాయి.
ఇంకా
మరిన్ని
విమాన
సర్వీసుల
టిక్కెట్ల
ధరలు
ఈ
విధంగా
ఉన్నాయి.
చెన్నై
నుంచి
బెంగుళూరుకు
రూ.1120,
చెన్న్నై
నుంచి
కొయంబత్తూర్కు
రూ.1148,
ఢిల్లీ
నుంచి
జైపూర్
నగరానికి
రూ.1176గా
నిర్ణయించారు.