గత ఏడాది కాలంలో మ్యూచువల్ ఫండ్లలోకి నిధుల వరద
2016 చివరి నాటికి ఫండ్ నిర్వహణ ఆస్తులు రూ.16.46 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది నవంబరు చివరి నాటికే ఈ విలువ రూ.23 లక్షల కోట్లకు పెరిగింది. అంటే దాదాపు ఏడాది కాల వ్యవధిలో రూ.6 లక్షల కోట్లు అన్
వివిధ మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లోకి వచ్చే నిధుల ప్రవాహం గత ఏడాది కాలంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. 2016 చివరి నాటికి ఫండ్ నిర్వహణ ఆస్తులు రూ.16.46 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది నవంబరు చివరి నాటికే ఈ విలువ రూ.23 లక్షల కోట్లకు పెరిగింది. అంటే దాదాపు ఏడాది కాల వ్యవధిలో వచ్చి పడిన సొమ్ము రూ.6 లక్షల కోట్లు అన్నమాట.
ఈ మధ్య కాలంలో సిప్ మార్గంలో పెట్టుబడులకు గణనీయమైన ఆదరణ ఏర్పడటం మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడుల నిర్వహణ ఆస్తులు పెరిగేందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సంవత్సర కాలంలో ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాల్లోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.1.4 లక్షల కోట్లు. ఒక నెలలో దాదాపుగా 9 లక్షల సిప్ ఖాతాలు పెరిగాయి. ఒక్కో ఖాతాలో సగటున ఒక్కో నెలకు రూ.5893 వచ్చి చేరాయి. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత, బ్యాలెన్స్డ్ ఫండ్లలోకి వచ్చిన మొత్తం డబ్బు విలువ 5.3 లక్షల కోట్లుగా ఉంది.
ఈ
ఏడాది
స్టాక్
మార్కెట్లో
మ్యూచువల్
ఫండ్
సంస్థలన్నీ
కలిపి
పెట్టుబడి
పెట్టిన
సొమ్ము
విలువ
రూ.1.15
లక్షల
కోట్లు.
ఏడాది
కాలంలో
ఇన్వెస్టర్ల
సంఖ్య
భారీగా
పెరగ్గా
మొత్తం
మ్యూచువల్
ఫండ్
ఇన్వెస్టర్ల
సంఖ్య
1.7
కోట్ల
మేర
పెరిగి
ఉంటుందని
అంచనా.
దీంతో
రిటైల్
ఇన్వెస్టర్ల
ఖాతాల
సంఖ్య
6.5
కోట్లు
అయింది.
ఫండ్
హౌస్లకు
సిప్
ద్వారా
రూ.53వేల
కోట్లు
వచ్చి
చేరాయి.
9లక్షల
సిప్
ఖాతాలు
కొత్తగా
వచ్చాయి.
అంతకు
ముందు
ఏడాది
కాలంలో
సిప్
రూపేణా
వచ్చిన
పెట్టుబడి
విలువ
రూ.3973
కోట్లుగా
ఉండగా
అదే
ఈ
ఏడాది
అది
రూ.5893
కోట్లుగా
ఉంది.
అంతే
కాకుండా
మ్యూచువల్
ఫండ్లను
నిర్వహిస్తున్న
కంపెనీల
వద్ద
ఉన్న
మొత్తం
డబ్బు
విలువ
40%
పెరిగిందని
తెలుస్తోంది.
మ్యూచువల్
ఫండ్
నిర్వహణ
ఆస్తుల
విలువ
ఇలా
పెరుగుకుంటూ
వెళ్లడం
వరుసగా
ఐదో
ఏడాది.