70 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
చాలా రోజుల తర్వాత మార్కెట్లు మురిశాయి. మదుపరి మెరిశాడు. సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 34,000 పాయింట్ల ఎగువన ముగిసింది. వెరసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 10,500 సెంటిమెంటు
చాలా రోజుల తర్వాత మార్కెట్లు మురిశాయి. మదుపరి మెరిశాడు. సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 34,000 పాయింట్ల ఎగువన ముగిసింది. వెరసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 10,500 సెంటిమెంటు స్థాయి దాటింది. గురువారం డిసెంబర్ సిరీస్ ముగియనుండటంతో రోజంతా కన్సాలిడేట్ అయిన మార్కెట్లు చివర్లో పుంజుకున్నాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 70 పాయింట్లు పెరిగి 34,010 వద్ద నిలవగా.. నిఫ్టీ 38 పాయింట్లు జమచేసుకుని 10,531 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(1.79%), లోహ(1.18%), హెల్త్ కేర్(0.59%), మౌలిక రంగం(0.53%) లాభపడిన వాటిలో ఉన్నాయి. మరో వైపు బ్యాంకింగ్, పవర్ రంగాలు నష్టాలకు గురయ్యాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి. యెస్ బ్యాంక్(1.89%), భారతీ ఎయిర్టెల్ (+ 1.72%), సన్ ఫార్మా (+ 1.24%), టాటా స్టీల్ (+ 1.18%) ఆసియా పెయింట్స్ (+ 1.08%) బాగా లాభపడ్డాయి., ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఎన్టిపిసి -1.56 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు (-0.88 శాతం), ఎం అండ్ ఎం (-0.88 శాతం), హీరో మోటో కార్ప్ (-0.87 శాతం), కోల్ ఇండియా (-0.81 శాతం) ముందున్నాయి.