దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ వచ్చే ఏడాది నుంచి పలు మోటారు సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్ బట్టి రూ.400 మేర టూవీలర్ ధరలను పెంచుతున్నట్లు, ఇది 2018 జ
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ వచ్చే ఏడాది నుంచి పలు మోటారు సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్ బట్టి రూ.400 మేర టూవీలర్ ధరలను పెంచుతున్నట్లు, ఇది 2018 జనవరి నుంచి అమల్లో ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ వారంలో హీరో మోటో కార్ప్ మూడు కొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఒకప్పుడు యువకులు స్ప్లెండర్ అంటే బాగా ఇష్టపడేవారు. తర్వాత అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తయారయింది. అయితే ఎన్ని పోటీ బైక్లు వచ్చినప్పటికీ అందులో చిన్న చిన్న మార్పులు చేస్తూ వివిధ వర్గాల్లో ఆసక్తి తగ్గకుండా స్ప్లెండర్ విషయంలో హీరో సంస్థ జాగ్రత్తలు పడుతూ వచ్చింది. ఆ విధంగా ఇప్పుడు సరికొత్తగా స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్రో, సూపర్ స్ప్లెండర్ వంటి వాటిని తీసుకొచ్చింది. ఇప్పుడు సూపర్ స్ప్లెండర్ సహా ప్యాషన్ ప్రోకు కొన్ని మార్పులు చేసి మూడు కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 2018 కొత్త ఏడాదిని దృష్టిలో పెట్టుకుని బైక్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే నూతన సంవత్సరంలో ఇవి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

హీరో మోటోకార్ప్, హీరో హోండాగా స్థాపించబడిన దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ. ఇది భారతదేశంలోనే టూవీలర్ల తయారీలో మొదటి స్థానంలో ఉంది. 1984లో హీరో సైకిల్స్ సంస్థకు చెందిన ఓం ప్రకాష్ మంజల్ జపాన్కు చెందిన హోండా కంపెనీతో కలిసి హీరో హోండాను స్థాపించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications