ఏటా తమకు వచ్చే ఆదాయం తక్కువ చేసి చూపిస్తూ ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులను ఎగ్గొడుతున్నాయి. దీనికి సంబంధించి జియో సైతం టాప్5 ఎగ్గొట్టిన టెలికాం సంస్థల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఏయే సంస్థ ప్రభు
ఒక వైపు 4జీ రాకతో ఇబ్బడిముబ్బడిగా ఆఫర్లు ఇస్తున్న టెలికాం సంస్థలు మరో వైపు ప్రభుత్వాన్ని దారుణంగా మోసం చేస్తున్నాయి. ఏటా తమకు వచ్చే ఆదాయం తక్కువ చేసి చూపిస్తూ ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులను ఎగ్గొడుతున్నాయి. దీనికి సంబంధించి జియో సైతం టాప్5 ఎగ్గొట్టిన టెలికాం సంస్థల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఏయే సంస్థ ప్రభుత్వానికి ఎంత నష్టం కలిగించిందో తెలుసుకుందాం.

1. కాగ్ నివేదికలో
కాగ్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో మొత్తం 5 టెలికాం సంస్థలు ప్రభుత్వాన్ని మోసం చేశాయని తెలిపింది. ప్రభుత్వానికి ఇటీవల టెలికాం ఆదాయం అనుకున్నంతగా రాలేదు. దీనికి తోడు ఐదు టెలికాం సంస్థలు కలిసి ప్రభుత్వానికి తమ ఆదాయంలో చెల్లింపుల్లో భాగంగా దాదాపు రూ.2579 కోట్ల మేర నష్టం కలిగించాయని కాగ్ తప్పుపట్టింది.

2. పార్లమెంటులో నివేదిక
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కాగ్ ఈ నివేదికను సమర్పించింది. ఇందులో టాటా టెలిసర్వీసెస్, టాటా టెలిసర్వీసెస్(మహారాష్ట్ర), క్వాండ్రంట్ టెలివెంచర్స్ లిమిటెడ్, వీడియోకాన్ టెలికమ్యూనికేషన్ లిమిటెడ్, టెలినార్ గ్రూప్, రిలయన్స్ గ్రూప్ సంస్థలు 2006-07 నుంచి 2014-15 మధ్య తమకు వచ్చిన ఆదాయం కంటే తక్కువగా చూపి తద్వారా ప్రభుత్వాన్ని మోసం చేశాయని కాగ్ బయటపెట్టింది. వార్షిక స్థూల ఆదాయం మొత్తం రూ.14,813 కోట్లు తక్కువ చేసి చూపడం ద్వారా ఇవి మోసానికి పాల్పడ్డాయనేది ఇక్కడ వెల్లడైన అంశం.

3.వివిధ రుసుములు, చార్జీలు
టెలికాం సంస్థలు ప్రభుత్వం నుంచి స్పెక్ట్రం తీసుకున్నందుకు గాను ఏటా ప్రభుత్వానికి కొన్ని చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, ఆలస్యంగా చెల్లిస్తే వడ్డీలు వంటివి ఉంటాయి. వీటన్నింటి విషయంలో టెలికాం సంస్థలు తమ మాయజాలాన్ని ప్రదర్శించినట్లు ఆడిటింగ్ సంస్థ నిరూపించింది.

4. ఈ రెండు ఇలా...
కార్పొరేట్లో పేరెన్నికగన్న టాటా గ్రూప్ సంస్థలు సైతం ప్రభుత్వాన్ని మోసం చేయడం గమనార్హం. టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్, టాటా టెలి సర్వీసెస్(మహారాష్ట్ర) రెండూ కలిసి దాదాపు రూ.1893 కోట్లు చెల్లించాల్సిన దాన్ని ఎగ్గొట్టాయి. మొత్తం ప్రభుత్వానికి నష్టం కలిగిన దానిలో ఇది సింహ భాగం. అదే విధంగా జియో ఇన్ఫోకామ్ సైతం రూ.6.78 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయంలో తక్కువ చూపి చేయవలసిన చెల్లింపులను చేయలేదని ప్రభుత్వ ఆడిటింగ్ సంస్థ వెల్లడించింది.

5. టాటా టెలిసర్వీసెస్, టాటా టెలిసర్వీసెస్(మహారాష్ట్ర)
లైసెన్సె ఫీజు: రూ.724.23 కోట్లు
స్పెక్ట్రం యూసేజీ చార్జీలు: రూ. 387 కోట్లు
పై రెండింటి మొత్తం:రూ. 1111.23 కోట్లు
వడ్డీ: రూ. 782.37 కోట్లు
మొత్తం ప్రభుత్వానికి కలిగించిన నష్టం: రూ. 1893.6 కోట్లు

6. టెలినార్
లైసెన్సు ఫీజు: రూ. 257.32 కోట్లు
స్పెక్ట్రం యూసేజీ చార్జీలు: రూ. 110.81 కోట్లు
పై రెండింటి మొత్తం:రూ. 368.13 కోట్లు
వడ్డీ: రూ. 235.62 కోట్లు
ప్రభుత్వానికి కలిగించిన మొత్తం నష్టం: రూ.603.75 కోట్లు

7. వీడియోకాన్
లైసెన్సు ఫీజు: రూ. 20.3 కోట్లు
స్పెక్ట్రం యూసేజీ చార్జీలు: రూ. 8.9 కోట్లు
పై రెండింటి మొత్తం:రూ. 29.2 కోట్లు
వడ్డీ: రూ. 18.88 కోట్లు
ప్రభుత్వానికి కలిగించిన మొత్తం నష్టం: రూ. 48.08 కోట్లు

8. క్వాడ్రంట్
లైసెన్సు ఫీజు: రూ. 8.22 కోట్లు
స్పెక్ట్రం యూసేజీ చార్జీలు: రూ. 4.82 కోట్లు
పై రెండింటి మొత్తం:రూ. 13.04 కోట్లు
వడ్డీ: రూ. 13.58 కోట్లు
ప్రభుత్వానికి కలిగించిన మొత్తం నష్టం: రూ. 26.62 కోట్లు

9. రిలయన్స్ జియో
లైసెన్సు ఫీజు: రూ. 5.1 కోట్లు
స్పెక్ట్రం యూసేజీ చార్జీలు: రూ. 0
పై రెండింటి మొత్తం:రూ. 5.1 కోట్లు
వడ్డీ: రూ. 1.68 కోట్లు
ప్రభుత్వానికి కలిగించిన మొత్తం నష్టం: రూ. 6.78 కోట్లు

10. 2006-07 నుంచి 2014-15 మధ్య
మొత్తం లైసెన్సు ఫీజు రూపంలో 5 కలిపి రూ.1015 కోట్లను ఎగ్గొట్టాయి.
స్పెక్ట్రం యూసేజీ చార్జీల రూపంలో 5 కలిసి రూ.511.53 కోట్లను ఎగవేశాయి.
వడ్డీ రూపంలో 1052.13 ఈ ఐదు సంస్థలు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంది.
మొత్తం మీద ఐదు సంస్థలు కలిపి రూ.2578.83 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం చేశాయనేది కాగ్ నివేదిక సారాంశం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications