For Daily Alerts
మార్కెట్ ట్రేడింగ్లో అత్యధికంగా లాభపడ్డ స్థిరాస్తి రంగం
సెన్సెక్స్ 59 పాయింట్లు(0.38%) దిగజారి 39,777 వద్ద ముగియగా మరో సూచీ నిఫ్టీ 19 పాయింట్లు క్షీణించి 10,444 వద్ద స్థిరపడింది.
|
వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 34,000 పాయింట్ల సమీపానికి చేరింది. ఒక దశలో 33,956ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 10,500 సమీపానికి చేరి 10,494 పాయింట్ల వరకూ వెళ్లింది. ఇంట్రాడేలో ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఆపై ట్రేడర్ల అప్రమత్తత కారణంగా మార్కెట్లు. కన్సాలిడేషన్ బాట పట్టాయి.దీంతో మార్కెట్లు స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 59 పాయింట్లు(0.38%) దిగజారి 39,777 వద్ద ముగియగా మరో సూచీ నిఫ్టీ 19 పాయింట్లు క్షీణించి 10,444 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(3.01%), లోహం(0.75%), ఇన్ఫ్రా(0.69%), మూలధన వస్తువులు(0.64%) మాత్రం లాభపడ్డాయి. మరో వైపు బ్యాంకింగ్(0.34%), ఆటో(0.3%), పీఎస్యూ(0.18%) నష్టపోయాయి.
సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో విప్రో(1.54%), ఓఎన్జీసీ(1.46%), హీరో మోటోకార్ప్(1.18%), ఎల్ అండ్ టీ(1.06%), ఇన్ఫోసిస్(0.85%) బాగా ముందుండగా, మరో వైపు నష్టపోయిన వాటిలో డాక్టర్ రెడ్డీస్(1.8%), భారతీ ఎయిర్టెల్(1.45%), టాటా స్టీల్(1.09%), హెచ్డీఎఫ్సీ(0.98%),హెచ్డీఎఫ్సీ(0.91%) ముందున్నాయి.
Comments
English summary
మార్కెట్ ట్రేడింగ్లో అత్యధికంగా లాభపడ్డ స్థిరాస్తి రంగం | markets down fall with slight losses
Story first published: Wednesday, December 20, 2017, 16:46 [IST]