For Quick Alerts
For Daily Alerts
200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
మూడు రోజులపాటు వరుసగా లాభాల్లో పయనించిన మార్కెట్లు ఈ రోజు వెనకడుగు వేశాయి. అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ట్రేడింగ్ ఆరంభం నుంచీ మార్కెట్లు ప్రతికూలంగానే కదిలాయి.
|
మూడు రోజులపాటు వరుసగా లాభాల్లో పయనించిన మార్కెట్లు ఈ రోజు వెనకడుగు వేశాయి. అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ట్రేడింగ్ ఆరంభం నుంచీ మార్కెట్లు ప్రతికూలంగానే కదిలాయి. మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు పెరగడంతో చివరిలో ఇంట్రాడే కనిష్టానికి చేరాయి. చివర్లోనూ అమ్మకాలదే పైచేయి కావడంతో ప్రస్తావించదగ్గ స్థాయిలో నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 228 పాయింట్లు దిగజారి 33,228 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 82 పాయింట్లు క్షీణించి 10,240 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన కంపెనీల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. బాగా లాభపడిన వాటిలో డాక్టర్ రెడ్డీస్(2.83%), అదానీ పోర్ట్స్(2.46%), ఓఎన్జీసీ(2.26%), లుపిన్(0.87%), ఇన్ఫోసిస్(0.76%) ముందుండగా మరో వైపు నష్టపోయిన వాటిలో కోల్ ఇండియా(2.45%), సిప్లా(2.17%), హీరో మోటోకార్ప్(1.98%), టీసీఎస్(1.58%), టాటా స్టీల్(1.54%) ముందున్నాయి.
Comments
English summary