ఒక మోస్తరు లాభాల్లో మార్కెట్లు
లాభాల్లో మార్కెట్లు
ఆర్బీఐ యథాతథ పాలసీతో బుధవారం బాగా నష్టపోయిన మార్కెట్లు ఒక్కరోజులోనే తిరిగి కోలుకున్నాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో ఆద్యంతమూ పటిష్ట లాభాలతో ట్రేడయ్యాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 352 పాయింట్లు కోలుకుని 32,949 వద్ద ముగిసింది. తద్వారా తిరిగి 33,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది. నవంబర్ 1 తర్వాత సెన్సెక్స్కు ఇదే అత్యధిక లాభం. ఇక నిఫ్టీ సైతం 123 పాయింట్లు పురోగమించి 10,167 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 64.59 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన కంపెనీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భారతీయ ఎయిర్టెల్ (+ 6.08%), ఏసియన్ పెయింట్స్ (+ 3.29%), మారుతీ (+ 3.26%), టాటా స్టీల్ (+ 2.97%), బజాజ్ ఆటో (+ 2.78%) లాభపడ్డాయి. మరో వైపు కోల్ ఇండియా (-0.64%), టిసిఎస్ (-0.52%), సిప్లా (-0.50%), విప్రో (-0.34%) మరియు సన్ ఫార్మా (-0.26%) ఉన్నాయి.