For Quick Alerts
For Daily Alerts
ఆర్బీఐ సమీక్షకు ముందు.. అప్రమత్తత... స్వల్ప నష్టాలు
రేపు ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష ఉండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో సెన్సెక్స్ 67 పాయింట్లు నష్టపోయి 32,802 వద్ద స్థిరపడగా నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 10,118 వద్ద ముగిసింది. బ
|
రేపు ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష ఉండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో సెన్సెక్స్ 67 పాయింట్లు నష్టపోయి 32,802 వద్ద స్థిరపడగా నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 10,118 వద్ద ముగిసింది. బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే పవర్(1.06%), లోహ రంగం(0.85%) నష్టపోగా మరో వైపు బ్యాంకింగ్, హెల్త్కేర్, టెలికాం రంగాలు స్వల్పంగా లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్లో లాభపడిన వాటిలో బజాజ్ ఫైనాన్స్(1.88%), యెస్ బ్యాంక్(1.81%), ఎస్బీఐ(1.75%), రిలయన్స్(1.34%), భారతీ ఎయిర్టెల్(1.31%) ముందుండగా మరో వైపు నష్టపోయిన వాటిలో హీరో మోటో కార్ప్(2.24%), విప్రో(2.40%), ఓఎన్జీసీ(1.76%), టాటా స్టీల్(1.76%), యూపీఎల్(1.73%) ప్రధానంగా ఉన్నాయి.
Comments
English summary
ఆర్బీఐ సమీక్షకు ముందు.. అప్రమత్తత... స్వల్ప నష్టాలు | markets ended with marginal losses
Story first published: Tuesday, December 5, 2017, 17:16 [IST]