అప్పుడు బాగానే బ్యాంకుల్లో జమ చేశారు. ఇప్పుడు వారికి మూడింది. పెద్ద నోట్ల మార్పిడి(రద్దు) తర్వాత బ్యాంకుల్లో రూ.25 లక్షలకు మించి జమ చేసి గడువులోపల రిటర్నులు దాఖలు చేయని 1.16 లక్షల మందికి
అప్పుడు బాగానే బ్యాంకుల్లో జమ చేశారు. ఇప్పుడు వారికి మూడింది. పెద్ద నోట్ల మార్పిడి(రద్దు) తర్వాత బ్యాంకుల్లో రూ.25 లక్షలకు మించి జమ చేసి గడువులోపల రిటర్నులు దాఖలు చేయని 1.16 లక్షల మందికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. బ్యాంకుల్లో రూ.2.5 లక్షలకు మించి డిపాజిట్లు చేసిన 18 లక్షల మందిని ఐటీ శాఖ గుర్తించింది. వీరిలో రూ.25 లక్షలకు మించి బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారికి నోటీసులు పంపింది. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారిని రెండు వర్గాలుగా విభజించారు. రూ.25 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు చేసిన వారు, రూ.10 నుంచి రూ.25 లక్షల మధ్య డిపాజిట్ చేసిన వారిగా వేరు చేశారు. అందులో రూ.25 లక్షల కంటే ఎక్కువ జమ చేసిన వారి సంఖ్య 1.16 లక్షలుగా ఉంది. వారందరికీ నోటీసులు పంపామని 30 రోజుల్లోగా ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సిందిగా సమయం ఇచ్చామని సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్రా చెప్పారు.

మొత్తం 2లక్షల 40 వేల మంది రూ.10 నుంచి రూ.25 లక్షల వరకూ నగదు డిపాజిట్లు చేశారు. రెండో దశలో వీరికి నోటీసులు పంపుతామని ఆయన అన్నారు. ఐటీ చట్టాన్ని అనుసరించి నోటీసులు వెళ్లాయన్నారు. ఐటీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను ఏప్రిల్-సెప్టెంబరు మధ్య 619 మందిని విచారించినట్లు వెల్లడించారు. మొత్తం 16.92 లక్షల బ్యాంకు ఖాతాలను జల్లెడ పట్టి క్లీన్ మనీ ఆపరేషన్ను చేపట్టారు. ఇందులో చాలా మందిని వివరణ అడగ్గా కేవలం 11.8 లక్షల మంది మాత్రమే స్పందించారు. దాదాపు రూ.3 లక్షల కోట్లకు సంబంధించి 17.73 లక్షల కేసులను అనుమానస్పదంగా గుర్తించారు. వారిపై ప్రభుత్వ నిఘా ఉంది. దశల వారీగా విచారణ కొనసాగే అవకాశం ఉంది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications