For Quick Alerts
For Daily Alerts
ముంబయిలో భారీ ఆర్డర్ దక్కించుకున్న ఎల్ అండ్ టీ కన్స్ట్రక్చన్స్
దేశీయ నిర్మాణ,ఇంజనీరింగ్ దిగ్గజం లార్సెన్&టుబ్రో (ఎల్ అండ్ టీ)కి చెందిన ఎల్ అండ్ టీ కన్స్ట్రక్చన్స్ భారీ ఆర్డర్లను దక్కించుకుంది. ముంబై ట్రాన్స్హార్బర్లింక్ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర మ
|
దేశీయ నిర్మాణ,ఇంజనీరింగ్ దిగ్గజం లార్సెన్&టుబ్రో (ఎల్ అండ్ టీ)కి చెందిన ఎల్ అండ్ టీ కన్స్ట్రక్చన్స్ భారీ ఆర్డర్లను దక్కించుకుంది. ముంబై ట్రాన్స్హార్బర్లింక్ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర మెట్రోపాలిటిన్ రిజన్ డెవెలప్మెంట్ ఆథారిటీ(ఎంఎంఆర్డీఏ)నుంచి రూ.8650 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకున్నట్లు ఎల్ అండ్ టీ తెలిపింది.
ఆర్డర్లలో భాగంగా ఎల్ అండ్ టీ కన్స్ట్రక్చన్స్ ముంబై మెయిన్లాండ్, నవీముంబై ప్రాంతాలను కలుపుతూ మధ్య 21.8 కి.మీటర్ల స్టీల్ వంతెనను నిర్మించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ సీఈఓ మాట్లాడుతూ ''ముంబై మెయిన్లాండ్, నవీముంబైల మధ్య మేము నిర్మించే ఈ వంతెన ముంబై ఆర్థికంగా మరింత బలపడుతుందని మేము నమ్ముతున్నాం. మాపై విశ్వాసాన్ని ఉంచి మాకు ఈ ప్రాజెక్ట్కు అప్పగించిన ఎంఎంఆర్డీఏ సంస్థకు మా చక్కటి పనితీరుతో సమాధానం చెపుతామని''తెలిపారు.
ఎల్ అండ్ టీ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. ఈ సంస్థ ఛైర్మన్గా ఏఎం నాయక్ వ్యవహరిస్తున్నారు. ఎండీగా ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Comments
English summary
ముంబయిలో భారీ ఆర్డర్ దక్కించుకున్న ఎల్ అండ్ టీ కన్స్ట్రక్చన్స్ | L&T Construction bags Rs. 8,650-cr order from MMRDA
Story first published: Saturday, November 18, 2017, 16:32 [IST]