వినియోగదారులు వాడే వస్తువులపై జీఎస్టీ రేట్ల తగ్గింపు
అత్యధిక స్థాయిలో అమ్ముడవుతున్న 28 శాతం పన్ను పరిధిలోకి వచ్చే వస్తువుల్లో చాలా వస్తువులపై పన్నులను తగ్గించినట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇంతకు ముందు 28% పన్ను శ్లాబులో 227 వస్తువ
వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి వ్యాపారవేత్తలు, వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించబోతోంది. అత్యధిక స్థాయిలో అమ్ముడవుతున్న 28 శాతం పన్ను పరిధిలోకి వచ్చే వస్తువుల్లో చాలా వస్తువులపై పన్నులను తగ్గించినట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇంతకు ముందు 28% పన్ను శ్లాబులో 227 వస్తువులుండగా అందులో 177 వస్తువులను తొలగించారు. ఆ వస్తువుల జాబితా ఈ విధంగా ఉంది.
28 శాతం నుంచి18 శాతానికి
చూయింగ్ గమ్, చాక్లెట్లు, కాఫీ
కస్టర్డ్ పౌడర్, పాలరాయి, గ్రానైట్
డెంటల్ హైజీన్ ఉత్పత్తులు
పాలిష్లు, క్రీములు, శానిటరీవేర్
తోలుతో చేసిన దుస్తులు
కృత్రిమ ఉన్ని, విగ్లు, కుక్కర్లు
స్టవ్లు, ఆఫ్టర్ షేవింగ్ క్రీములు,
డియోడరెంట్లు, డిటర్జెంట్, వాషింగ్ పౌడర్
రేజర్లు, బ్లేడ్లు, కట్లెరీ
స్టోరేజ్ వాటర్ హీటర్లు, బ్యాటరీలు, గాగుల్స్
రిస్ట్ వాచీలు, పరుపులు, వైర్లు, కేబుల్స్
ఫర్నీచర్, సూట్కేసులు, షాంపూలు,
హెయిర్ క్రీములు, హెయిర్ డైస్, ఫ్యాన్లు
మేకప్ సామాగ్రి, లాంప్స్, రబ్బర్ ట్యూబులు, మైక్రోస్కోపులు
18 శాతం నుంచి 12 శాతానికి
కండెన్స్డ్ మిల్క్, రిఫైండ్ షుగర్, పాస్టా కర్రీ పేస్ట్
డయాబెటిక్ ఫుడ్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్
ప్రింటింగ్ ఇంక్, హ్యాండ్ బ్యాగులు, హ్యాట్స్
కళ్లజోళ్ల ఫ్రేములు, వెదురు, పుల్లలతో చేసిన ఫర్నీచర్
18 శాతం నుంచి 5 శాతానికి
ఆటుకులతో చేసిన చిక్కీలు, బంగాళాదుంపల పిండి
చట్నీలకు ఉపయోగించే పిండి
ఫ్లై యాష్, ముడి చమురు రిఫైనింగ్తో వచ్చే ఫ్లై సల్ఫర్ 5 శాతం నుంచి సున్నాకు
గోరు చిక్కుడు గింజల పొడి, కొన్ని రకాల ఎండు కూరగాయలు
కొబ్బరి చిప్పలు, చేపలు జిఎ్సటి 12 శాతం నుంచి 5 శాతానికి
ఇడ్లీ, దోశ పిండి, శుద్ధి చేసిన తోలు, పీచు, చేపల వలలు, కొబ్బరి పొడి
ఇతరాలు
సాధారణ కిచెన్ సామాగ్రిపై 28% నుంచి 12%కి తగ్గింపు
రెస్టారెంట్లలో తినే ఆహారంపై 5 శాతం శ్లాబు మాత్రమే వర్తిస్తుంది(5 స్టార్ హోటళ్లకు వర్తించదు)