స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్ సూచీలు
మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 64 పాయింట్లు లాభపడి 33,315 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకొని 10,3212 వద్ద స్థిరపడ్డాయి.
వారాంతంలో లాభనష్టాల మధ్య వూగిసలాడిన మార్కెట్లు చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. కొన్ని వస్తువులపై జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 64 పాయింట్లు లాభపడి 33,315 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకొని 10,3212 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే క్యాపిటల్ గూడ్స్(1.87%), కన్సూమర్ డ్యూరబుల్స్(1.36%), బ్యాంకింగ్(1.00%), పీఎస్యూ(0.87%) లాభపడ్డాయి. మరో వైపు హెల్త్ కేర్(0.92%), చమురు,సహజ వాయువు(0.71%), ఆటో(0.63%), ఐటీ(0.22%) రంగాలు నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో బాగా లాభపడ్డ వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(6.2%), ఎల్ అండ్ టీ(3.9%), హెచ్యూఎల్(2.99%), ఎం అండ్ ఎం(2.34%), ఐసీఐసీఐ బ్యాంక్(2.25%) ముందుండగా మరో వైపు టాటా మోటార్స్(4.01%), రిలయన్స్(2%), ఏసియన్ పెయింట్స్(1.57%), సన్ ఫార్మా(1.42%), కొటక్ బ్యాంక్(1.27%) నష్టపోయిన వాటిలో ముందున్నాయి.


Click it and Unblock the Notifications